జేఎన్టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్ సీట్లు
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్
4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
విజయనగరంలోని జేఎన్టీయూ విద్యాలయం
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల ఒకటో తేదీ నుంచి రిజిప్రక్రియ ప్రారంభమైంది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి విజయనగరం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ గురజాడ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 20,310 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి భారీగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూ పరిధిలో పూర్వ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 25 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈమేరకు వీటిలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినవి తొమ్మిది ఉన్నాయి. ఏఐటీటీఈ అనుమతి పొందిన సీట్లకు మాత్రమే అవకాశం ఇస్తారు. గత విద్యా సంవత్సరంలో 17వేల సీట్లకే ప్రవేశాలు కల్పించారు.
కంప్యూటర్ కోర్సులకే మొగ్గు..
ఇంజినీరింగ్లో కంప్యూటర్ కోర్సులకే ఎక్కువగా డిమాండ్ నెలకొంది. ప్రస్తుతమున్న కళాశాలల్లో 70 శాతం సీట్లు సీఎస్ఈ, వాటి అనుబంధ కోర్సులవే ఉంటున్నాయి. తర్వాత డిమాండు మేరకు ఐటీ, ఏఐ, ఏఐఎంఎల్, డేటా సైన్స్ వంటివాటిపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఒక్కో కళాశాలలో 3- 6 సెక్షన్ల వరకు ఈ కోర్సులే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ పరిధిలోని కళాశాలలు ఈ ఏడాది ఆయా కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతి పొందాయి. సీఎస్ఈ రానివారు సమానమైన ఇతరత్రా కోర్సుల్లో చేరుతున్నారు. ఇంజినీరింగ్లో ర్యాంకు రానివారు, సీటు రాదని తెలుసుకున్న వారు యాజమాన్యకోటాలో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ సీట్లలో ఒక్కో కళాశాల ఒక్కో విధంగా రేట్లను నిర్దేశిస్తున్నాయి.
08 నుంచి ఐచ్ఛికాల నమోదు
ఈనెల ఏడో తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఏపీఈఏపీసెట్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 4 నుంచి పదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం వెబ్ఆప్షన్ల నమోదు, ఐచ్ఛికాల్లో మార్పులు, సీట్ల కేటాయింపు, తరగతుల నిర్వహణ ఉండనున్నాయి. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు.
2 సహాయక కేంద్రాలు..
ఉమ్మడి జిల్లాలో విజయనగరం మహారాజా ఆనంద గజపతిరాజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పార్వతీపురం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలను సహాయ కేంద్రాలుగా కేటాయించారు. ఇక్కడ నాలుగోతేదీ నుంచి ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరిశీలన మేరకు అభ్యర్థులకు సందేహాలు, లేదా ధ్రువపత్రాల సమస్యలుంటే సంప్రదించవచ్చని కేంద్రాల సమన్వయాధికారులు ఆశారమణి, విలియం కేరీ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
వెసులుబాటుతో..
గతంలో అదనపు సెక్షన్లు, సీట్ల పెంపు కోసం ఎన్బీఏ(నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్) వంటి నిబంధనలు ఉండేవి. ఇప్పుడు కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుంటే చాలు. వసతి, ఫ్యాకల్టీ సౌకర్యాలు చూపితే సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ వెసులుబాటు కల్పించింది. అభ్యర్థుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కళాశాలలు సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి.
- రాజేశ్వరరావు, ఇన్ఛార్జి రిజిస్ట్రార్, జేఎన్టీయూ గురజాడ విద్యాలయం
సీట్లు ఇలా.. బీ జేఎన్టీయూ పరిధిలో కళాశాలలు - 25 బీ సీట్లు - 20,310 బీ ఉమ్మడి జిల్లాలో కళాశాలలు - 09 బీ సీట్ల సంఖ్య - 6,270
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.