కిట్టు కనిపిస్తే ఒట్టు!
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
వైకాపా ప్రభుత్వంలో నిలిచిన పంపిణీ
పేదలకు పెరిగిన ఆర్థికభారం
ప్రసూతి వార్డులో బాలింతలు
న్యూస్టుడే, పార్వతీపురం పట్టణం: శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లు ఉచితంగా అందించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటి పంపిణీ నిలిపివేసింది. దీంతో పేదలకు భారంగా మారింది.
కిట్లలో ఏముంటాయ్
సొంతంగా కొనుక్కున్న బేబీ బెడ్లో చిన్నారి
పుట్టిన పిల్లలు తల్లి పక్కనే సుఖంగా నిద్రపోయేందుకు బెడ్, దోమ తెర, తల్లులు చేతులు శుభ్రం చేసుకొనే ద్రావణం(శానిటైజర్), బేబీ సబ్బు, పౌడర్, న్యాప్కిన్ ఉండేవి. వాటిని బయట కొనాలంటే రూ.వేయి నుంచి రూ.1500 వరకు ఉంటుంది. కిట్టులోని సామగ్రితో పిల్లలకు ఆరోగ్య భద్రత ఉండేది. ప్రస్తుతం పరుపు ఒక్కటే బయట రూ.400 నుంచి రూ.500లు పలుకుతోంది. అవీ నాసిరకంగా ఉంటున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు.
సొంతంగా కొనుగోలు
జిల్లాలో కేంద్ర, ప్రాంతీయాసుపత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయి. వారిలో పేదలే అధికం. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చించాల్సి రావడంతో సామన్య, మధ్యతరగతి, పేదలు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. వారికి బేబీ కిట్లు ఉపయుక్తంగా ఉండేవి. నాలుగేళ్లుగా వాటి పంపిణీ నిలిచిపోవడంతో సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఇందుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు పేదలపై ఆర్థిక భారం పడుతోంది.
బయట కొన్నాం..
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బేబీ కిట్టు ఇచ్చేవారు. ప్రస్తుతం రావడం లేదని చెబుతున్నారు. బయట ఒక్క బెడ్ మాత్రమే కొన్నాం. రూ.400 తీసుకున్నారు. అది కూడా నాణ్యత లేక వారం రోజులకే పాడైంది. ప్రభుత్వం అందిస్తే బాగుండేది.
సుభద్ర, బాలింత
ఉన్నతాధికారులకు విన్నవిస్తాం..
ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపునకు ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. మెరుగైన సేవలకు చర్యలు తీసుకున్నాం. కొన్నాళ్లు బేబీ కిట్లు కూడా అందించాం. ప్రస్తుతం పంపిణీ నిలిచిపోయింది. జిల్లా ఆసుపత్రిలో నెలకు 300 లకు పైగా ప్రసవాలు చేస్తున్నాం. కిట్ల పంపిణీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
వాగ్దేవి, డీసీహెచ్ఎస్, పార్వతీపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదులన్నీ తవ్వేశారు.. ఇసుకంతా బొక్కేశారు
[ 03-07-2024]
జగన్ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు. -
మన బడులకు మహర్దశ
[ 03-07-2024]
విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. -
ఆ గ్రామాలకు చదువు దూరం
[ 03-07-2024]
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కుంతేసు పంచాయతీలో గిరిజన గ్రామాలు తినుకు, బద్దడిలో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక విద్య, వైద్యం దయనీయమైంది -
మూడేళ్ల నిర్లక్ష్యం..రోగులకు శాపం
[ 03-07-2024]
గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు -
గిరిజన ద్రోహి జగన్
[ 03-07-2024]
గిరిజన హక్కులు, రిజర్వేషన్లు కాలరాసి జగన్మోహనరెడ్డి గిరిజన ద్రోహిగా మిగిలారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. -
నిధులు ఆరగింపు.. వైద్య కళాశాలకు గ్రహణం
[ 03-07-2024]
వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మంజూరు చేసిన నిధులను మళ్లించింది. -
లాజిస్టిక్స్ ఆదాయంలో ముందంజ
[ 03-07-2024]
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది. -
ఈఎస్ఐ సేవలు అందేదెప్పుడో?
[ 03-07-2024]
గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది -
విద్యుత్తు బిల్లులు ఇలా కట్టేయొచ్చు
[ 03-07-2024]
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి -
జేఎన్టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్ సీట్లు
[ 03-07-2024]
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య