అనాస రైతుల ఆందోళన
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు.
సీతంపేటలో అమ్మకాలు
సీతంపేట, న్యూస్టుడే: మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటం, పంటంతా ఒకేసారి పక్వానికి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతకు వచ్చే వివిధ ప్రాంతాల వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు.
గత వారం ఒక్కో కాయ సైజు బట్టి రూ.10 నుంచి రూ.18 వరకు పలకగా, ప్రస్తుతం రూ.5 నుంచి రూ.13 లోపే కొంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. నిల్వ ఉంచే వీలు లేకపోవడం, పంటంతా ఒకేసారి తీసుకురావడంతో చేసేది లేక వ్యాపారులు అడిగిన ధరకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ పండే పైనాపిల్తో జ్యూస్, ఆహార పదార్థాలు తయారు చేసేలా ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. సీతంపేటలో రూ.5 కోట్లతో అనాస ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదులన్నీ తవ్వేశారు.. ఇసుకంతా బొక్కేశారు
[ 03-07-2024]
జగన్ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు. -
మన బడులకు మహర్దశ
[ 03-07-2024]
విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. -
ఆ గ్రామాలకు చదువు దూరం
[ 03-07-2024]
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కుంతేసు పంచాయతీలో గిరిజన గ్రామాలు తినుకు, బద్దడిలో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక విద్య, వైద్యం దయనీయమైంది -
మూడేళ్ల నిర్లక్ష్యం..రోగులకు శాపం
[ 03-07-2024]
గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు -
గిరిజన ద్రోహి జగన్
[ 03-07-2024]
గిరిజన హక్కులు, రిజర్వేషన్లు కాలరాసి జగన్మోహనరెడ్డి గిరిజన ద్రోహిగా మిగిలారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. -
నిధులు ఆరగింపు.. వైద్య కళాశాలకు గ్రహణం
[ 03-07-2024]
వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మంజూరు చేసిన నిధులను మళ్లించింది. -
లాజిస్టిక్స్ ఆదాయంలో ముందంజ
[ 03-07-2024]
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది. -
ఈఎస్ఐ సేవలు అందేదెప్పుడో?
[ 03-07-2024]
గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది -
విద్యుత్తు బిల్లులు ఇలా కట్టేయొచ్చు
[ 03-07-2024]
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి -
జేఎన్టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్ సీట్లు
[ 03-07-2024]
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి