logo

విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి

భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు.

Published : 01 Jul 2024 05:41 IST

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడును కలిసిన ఎమ్మెల్యే మాధవి 

భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. ఆదివారం శ్రీకాకుళంలో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా సహకారం అందించాలని మంత్రిని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు