ఇక రైతు సేవా కేంద్రాలు
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి.
సీహెచ్ బొడ్డవలసలో రైతు భరోసా కేంద్రం
బొబ్బిలి గ్రామీణం, న్యూస్టుడే: రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. వైకాపా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ఆ పరిధిలో ఆర్బీకేలను ఏర్పాటుచేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు వీటి ద్వారానే అందిస్తున్నారు. పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పినా అమలు కాలేదు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.23 లక్షల చొప్పున ఉపాధి నిధులు వెచ్చించారు. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ప్రభుత్వం నియమించింది. వారే రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. జిల్లాలో 510 ఆర్బీకేలున్నాయి. కొన్నిచోట్ల భవనాలు మంజూరైనా బిల్లులు చెల్లించకపోవడంతో సగంలో పనులు నిలిచిపోయాయి. రైతులకు సమాచారం అందించే రైతు భరోసా మేగజైన్ను ‘పాడిపంటలు’గా పేరు మార్చారు. ఆర్బీకే ఛానల్కు పాడిపంటలు ఛానల్గా మార్చారు. రైతు సేవా కేంద్రాలుగా మార్చుతూ ఆదేశాలొచ్చాయని బొబ్బిలి ఏడీఏ మజ్జి శ్యామ్సుందర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ గ్రామాలకు చదువు దూరం
[ 03-07-2024]
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కుంతేసు పంచాయతీలో గిరిజన గ్రామాలు తినుకు, బద్దడిలో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక విద్య, వైద్యం దయనీయమైంది -
మూడేళ్ల నిర్లక్ష్యం..రోగులకు శాపం
[ 03-07-2024]
గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు -
గిరిజన ద్రోహి జగన్
[ 03-07-2024]
గిరిజన హక్కులు, రిజర్వేషన్లు కాలరాసి జగన్మోహనరెడ్డి గిరిజన ద్రోహిగా మిగిలారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. -
లాజిస్టిక్స్ ఆదాయంలో ముందంజ
[ 03-07-2024]
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది. -
ఈఎస్ఐ సేవలు అందేదెప్పుడో?
[ 03-07-2024]
గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది -
విద్యుత్తు బిల్లులు ఇలా కట్టేయొచ్చు
[ 03-07-2024]
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి -
జేఎన్టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్ సీట్లు
[ 03-07-2024]
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి