logo

మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ

తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

Published : 01 Jul 2024 05:09 IST

ఆలయం వద్ద కుటుంబసభ్యులతో కలిశెట్టి 

తిరుమల, విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. రాజధాని, పోలవరం నిర్మాణానికి తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రవాస భారతీయులు విరాళాలు అందించాలని  పిలుపునిచ్చారు. ‘ఈనాడు’ సంస్థల అధినేత దివంగత రామోజీరావు తనకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తానన్నారు. * మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును జూబ్ల్లీహిల్స్‌లో ఎంపీ కలిశారు. ఆయన జీవిత చరిత్రపై వెలువడిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని