78 వేల ఎకరాలకు తోటపల్లి జలాలు
తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
గంగమ్మకు పూజలు చేస్తున్న మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు
గరుగుబిల్లి, న్యూస్టుడే: తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ నుంచి జలాలు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని, కాలువల్లో కనీసం పూడిక కూడా తీయలేదన్నారు. గరుగుబిల్లి, కురుపాం మండలాలకు నీరందేలా చూడాలని సూచించారు. మన్యంలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. జిల్లాలోని రోడ్లు, పంచాయతీల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐటీడీఏని గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని, గిరిజనుల అభ్యున్నతి దృష్ట్యా ఇక నుంచి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొమరాడ మండలంలోని పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎడమ కాలువ నుంచి శివారు భూములకు సాగునీరు అందేలా పూడిక తీత చేపట్టి పిల్ల కాలువలను వెడల్పు చేయాలని కోరారు.
118 కిలోమీటర్ల వరకు నీరు
ప్రస్తుతం కుడి కాలువ నుంచి 118 కిలోమీటర్ల పొడవున పూసపాటిరేగ వరకు సాగు నీరు అందిస్తామని ఇరిగేషన్ సీఈ ఎస్.సుగుణాకరరావు పేర్కొన్నారు. కాలువలో 1700 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, గరుగుబిల్లి తెదేపా, జనసేన మండలాధ్యక్షులు ఎ.మధుసూదనరావు, శంకరరావు, నాయకులు ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.బి.విజయాంకుశం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!