ఎట్టకేలకు కదిలారు
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు.
రాజీవ్నగర్లో అక్రమ నిర్మాణం కూల్చివేత
విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలో ఉన్న
మాన్సాస్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని జేసీబీలతో
తొలగిస్తున్న పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన నాయకులు ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించారు. మాన్సాస్ సంస్థకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రధాన కాలువను మళ్లించారు. దీంతో మురుగు పెద్దఎత్తున నిలిచిపోయేది. ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని అక్కడివారు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అనుచరులు కావడంతో వదిలేశారు. గురువారం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు దృష్టికి స్థానికులు సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె పరిశీలించారు. ఈక్రమంలో మాన్సాస్ అధికారుల ఫిర్యాదుతో వాటిని కూల్చేశారు. దారి మళ్లించి ఏర్పాటు చేసిన కాలువను సైతం తొలగించినట్లు సహాయక సిటీ ప్లానర్ మధుసూదనరావు ‘న్యూస్టుడే’కు తెలిపారు. తమ స్థలం ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మాన్సాస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.