ప్రయోగాల వేదికపై ప్రశంసలు
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు.
తరంగాల ప్రయోగాన్ని వివరిస్తున్న చంద్రశేఖర్
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. భౌతికశాస్త్రంలో ప్రాథమిక, సంక్లిష్ట అంశాలను ఇంట్లో ఉండే వస్తువులతో విద్యార్థులకు బోధించే విధానాన్ని ప్రయోగపూర్వకంగా వివరించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్, నేషనల్ అన్వేషిక నెట్వర్క్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు హిమాచల్ప్రదేశ్లో జరిగిన సదస్సు ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి చంద్రశేఖర్ ఒక్కరికే అవకాశం దక్కింది. ఆయన ప్రస్తుతం రాజాం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. సమాంతర విద్యుత్తు ప్రవాహం, పీడనం, ప్రాథమిక, గౌణ తరంగాలు, తరంగచలనం తదితర ప్రయోగాలతో ప్రముఖులను ఆలోచింపజేశారు. జాతీయ అన్వేషిక నెట్వర్క్ సమన్వయకర్త, పద్మశ్రీ హెచ్.సి.వర్మ, భారత భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల సంఘం జాతీయ అధ్యక్షుడు పి.కె.అహ్లువాలియా, ఎన్ఐటీ సంచాలకుడు సూర్యవంశీల చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.