భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు, జరిమానా
మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది.
బాడంగి, న్యూస్టుడే: మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన సూరిబాబు కొన్నేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన మహిళను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. ఈక్రమంలో తరచూ గొడవలు జరిగేవి. దీంతో 2021, జులై నెలలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ ఘటనపై అప్పటి బాడంగి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో హింస, హత్యాయత్నం కేసులపై జైలు శిక్షలు, జరిమానా విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పు ఇచ్చినట్లు పీపీ మజ్జి జగన్నాథరావు, ఏఎస్సై డి.కొండలరావు శుక్రవారం తెలిపారు. రెండు శిక్షలనూ ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ దుర్మరణం
నెల్లిమర్ల, న్యూస్టుడే: విధి నిర్వహణలో ఉన్న ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన మండలంలోని సారిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ డి.రామగణేష్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బోనుమహంతి విజయ్కుమార్(28) ఎలక్ట్రీషియన్గా ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. ఉదయం గ్రామంలోని కిలారి విభీషణరావు ఇంటి మేడపైన ఉన్న పిట్ట గోడపై విద్యుత్తు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని వెంటనే ఆటోలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!