కాల్వలకు మోక్షం.. కర్షకులకు సుభిక్షం
పంట కాలువలకు మోక్షం కలగనుంది. ప్రస్తుత ఖరీఫ్లోనే పనులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు సమాయత్తమయ్యారు.
పూడిక తొలగింపునకు అంచనాల తయారీకి ఆదేశం
తుప్పలతో నిండిన వెంగళరాయ కుడి ఉప కాలువ
బొబ్బిలి, న్యూస్టుడే: పంట కాలువలకు మోక్షం కలగనుంది. ప్రస్తుత ఖరీఫ్లోనే పనులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు సమాయత్తమయ్యారు. అత్యవసర పనుల కింద కొంతమేర చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నారుమడులు జులై నెలాఖరుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో ఉభాలు సాగుతాయి. ఈ మధ్యలో ఉన్న నెల రోజుల వ్యవధిలో పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో వర్షాలు ఎంత మేరకు సహకరిస్తాయన్నదే ప్రశ్న. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. జేసీబీల సాయంతోనే పనులు జరగాల్సి ఉంది.
ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వ హయాంలో పంట కాలువల్లో పూడికతీత పూర్తిస్థాయిలో జరగలేదు. ఉపాధి హామీ పథకంలో అంతంతమాత్రంగా చేపట్టి చేతులు దులుపుకొన్నారు. జల వనరుల శాఖ వద్ద నిధులు లేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో సగం ఆయకట్టుకు కూడా నీరందక ఏటా రైతులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వం మారాక కాలువల్లో పూడికతీతపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రాజెక్టుల వారీ అంచనాలు
ప్రాజెక్టుల వారీగా కాలువల్లో పూడిక తొలగించేందుకు ఎంత మేర నిధులు అవసరమో అంచనాలు తయారు చేయాలని ఎస్ఈ రాజరాజేశ్వరి రెండు రోజుల కిందట సర్కిల్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే సిద్ధం చేయాలని ఈఈ, డీఈఈ, ఏఈలను ఆదేశించారు. జంఝావతి, పెద్దగెడ్డ, వట్టిగెడ్డ, వెంగళరాయ, పెద్దగెడ్డ, పారాది, గొలుసుమెట్ట జలాశయాల గురించి చర్చించారు. అన్ని చోట్లా పూడిక తీయాలని ఇంజినీర్లకు సూచించారు. ఒక్కో జలాశయం పరిధిలో కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో పూడిక తీయాలంటే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ఇంజినీర్లు ప్రాథమికంగా చెప్పారు. ఏది ఏమైనా అంచనాలు తయారు చేస్తే ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదించాలని ఎస్ఈ సూచించారు. ప్రస్తుతం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూడిక తొలగింపునకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు తయారు చేయాలని సూచించామని ఎస్ఈ రాజరాజేశ్వరి ‘న్యూస్టుడే’తో అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
-
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!
-
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM