అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు
వైకాపా హయాంలో జిల్లా కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదే ఆ పార్టీ విధానమని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు.
వైకాపా కార్యాలయాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: వైకాపా హయాంలో జిల్లా కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదే ఆ పార్టీ విధానమని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని గురువారం కూటమి నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఇలాంటి అక్రమ కట్టడాలపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. వైకాపా అంటేనే ఆక్రమణలు, అక్రమాలు, దందాలు, దోపిడీలని మండిపడ్డారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన శంకుస్థాపనలకు మళ్లీ కొబ్బరి కాయలు కొట్టారు తప్ప గత అయిదేళ్లలో ఎక్కడా అభివృద్ధి పనులు లేవన్నారు. నాయకులు ఐవీపీ.రాజు, ప్రసాదుల వరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, కర్రోతు నరసింగరావు, పిళ్లా విజయ్కుమార్, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 01-07-2024]
బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది. -
పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. -
డెంగీ వ్యతిరేక మాసోత్సవ అవగాహన ర్యాలీ
[ 01-07-2024]
డెంగీ వ్యాధిని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట పీహెచ్సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి అన్నారు. -
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
లెదర్ ఫినిష్తో రియల్మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..