ప్రతి ఎకరాకూ సాగునీరు
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకూ నీరందించే ప్రణాళికతో ముందుకెళ్లాలని జల నవరుల శాఖ అధికారులను కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు.
జల వనరుల శాఖ సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకూ నీరందించే ప్రణాళికతో ముందుకెళ్లాలని జల నవరుల శాఖ అధికారులను కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. విజయనగరంలోని తన ఛాంబర్లో గురువారం సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, ఖరీఫ్ సీజన్లో నీటి లభ్యత తదితర అంశాలపై ఇంజినీర్లతో సమీక్షించారు. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్య ఇంజినీరు ఎస్.సుగుణాకరరావు వివరించారు. బాగుచేసేందుకు రూ.4.30 కోట్లు అవసరమని తెలిపారు. రాష్ట్రస్థాయి అధికారులతో సంప్రదించి మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ భరోసానిచ్చారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో పెండింగ్ అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షిస్తానన్నారు. జులై ఒకటో తేదీ నుంచి తాటిపూడి, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు.
4 దశల్లో రోడ్ల మరమ్మతులు
రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉన్న 1505 కిలోమీటర్లలో గుంతలు పడిన వాటికి నాలుగు దశల్లో మరమ్మతులు చేసి, ప్రజల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆ శాఖ పర్యవేక్షక ఇంజినీరు విజయరత్నానికి సూచించారు. పారాది వంతెన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుత్తేదారుకు నోటీసు జారీ చేసి, ఎప్పటి నుంచి పనులు మొదలు పెడతారో తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రాజాంలో రోడ్ల విస్తరణ, అన్ని నియోజకవర్గాల్లో మరమ్మతులకు సంబంధించి నివేదిక అందజేయాలన్నారు.
చెత్త సేకరణ తప్పనిసరి..
అన్ని పంచాయతీల్లో చెత్తసేకరణ తప్పనిసరి అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 200 పంచాయతీల్లోనే ప్రక్రియ సాగుతోందని డీపీవో శ్రీధర్రాజా తెలపగా, 15 రోజుల్లో అన్నిచోట్లా నిర్వహించాలని ఆయనను ఆదేశించారు. నిధుల లభ్యత, పెండింగ్ బిల్లుల వివరాలు తెలుసుకున్నారు. జల్జీవన్ మిషన్ లక్ష్యాలను వందశాతం చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఉమాశంకర్కు చెప్పారు.
ఉపాధి.. అభివృద్ధి
ఎన్ఆర్జీఎస్ పథకాన్ని కేవలం కూలీల ఉపాధి కల్పనకే పరిమితం చేయకుండా.. అభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలన్నారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. సాగుకు ఉపయోగపడే నీటి వనరులు, కాలువల బాగు, రహదారుల అభివృద్ధి, ఉద్యానవనాలు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 3 నుంచి 6 ఏళ్ల వయసు లోపుగల పిల్లలంతా అంగన్వాడీల్లో ఉండాలన్నారు. రక్తహీనత ఉన్న వారికి పోషకాహారం, మందులు అందించాలని, అనాథ పిల్లలను శిశుగృహాల్లో చేర్పించాలన్నారు. రెండు వారాల్లో టిడ్కో గృహాలను ప్రారంభించాలని ఆదేశించారు. అక్కడ మౌలిక వసతుల కల్పన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో మెటా ఏఐ మీకూ వచ్చిందా? ఏ సమాచారమైనా ఇక క్షణాల్లో..!
-
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
-
‘తంగలాన్’ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..
-
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
-
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
-
ఎన్టీఆర్ భవన్పై దాడి ఘటన.. విచారణ చేపట్టిన పోలీసులు