logo

కొలంబో, దుబాయ్‌లకు విమాన సేవల పునరుద్ధరణకు వినతి

విశాఖపట్నం నుంచి కొలంబో, దుబాయ్‌లకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

Published : 28 Jun 2024 05:39 IST

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ అప్పలనాయుడు 

ఈనాడు, విజయనగరం: విశాఖపట్నం నుంచి కొలంబో, దుబాయ్‌లకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఉత్తరాంధ్ర వాసులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కరోనా సమయంలో వీటిని నిలిపివేశారన్నారు. దీనిపై దిల్లీలో గురువారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. విశాఖ నుంచి సూరత్, ముంబయి, వారణాసి నగరాలకు నూతన విమానయాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరానని చెప్పారు. గురువారం లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించినట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని