గిరిజనుల గుండెల్లో గోస్తనీ గుబులు
వంతెన సౌకర్యం లేక గంట్యాడ మండలం దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు.
దాసరితోట వంతెన పూర్తికాక నరకం
అసంపూర్తి వంతెన కింద గోస్తనీ నదీ ప్రవాహంలో చిక్కుకున్న ఆటోను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు
వంతెన సౌకర్యం లేక గంట్యాడ మండలం దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరంతా ఎస్.కోట మండలంతో పాటు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అనంతగిరి మండలంలోని దాసరితోట వద్ద గోస్తనీ నదిని దాటాల్సిందే. ఇక్కడ రెండేళ్ల కిందట రహదారి, వంతెన నిర్మాణానికి రూ.11 కోట్లు కేటాయించారు. వంతెన పనులు ప్రారంభించినప్పటికీ, నిధులు విడుదల కాక 20 శాతం పనులు వదిలేశారు. దీంతో వారధి ఉన్నప్పటికీ, నదిని దాటలేక నీటిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ప్రమాదకరంగా నదిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. గురువారం వర్షం కారణంగా ఏటిలోకి దిగిన ఓ ఆటో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో గిరిజనులు భయంతో నదిలో దిగి ఒడ్డుకు చేరుకున్నారు. తరువాత స్థానికులు అతికష్టం మీద వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. గతేడాది మన్యం జిల్లాకు చెందిన ముగ్గురు గిరిజనులు ఏరు దాటుతుండగా గల్లంతయ్యారు. వంతెన సౌకర్యం లేక అత్యవసర వైద్య సహాయం కూడా అందని పరిస్థితి నెలకొంది. పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
న్యూస్టుడే, గంట్యాడ, గంట్యాడ గ్రామీణం
వంతెనల పూర్తికి వినతి
పూర్తికాని సీతానగరం వారధి
పార్వతీపురం పట్టణం, సీతానగరం: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తి చేయాలని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి వాసవీ లారీ ఓనర్ల సంఘాధ్యక్షుడు జి.రమణమూర్తి వినతిపత్రం అందజేశారు. ఒడిశా వెళ్లేందుకు పారాది, సీతానగరం, కోటిపాం ప్రాంతాల్లో ఉన్న వంతెనలు దాటాల్సి ఉందన్నారు. అప్పట్లో పది టన్నుల సామర్థ్యంతో వీటిని నిర్మించారని, ప్రస్తుతం 60 టన్నుల బరువుతో లారీలు నడుస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. పారాది వద్ద నిర్మించిన కాజ్వే నదిలో కొట్టుకుపోయినట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒడిశా వెళ్లేందుకు అదనంగా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM