ఎడ్సెట్లో మెరుపులు
ఎడ్సెట్-24 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జీవశాస్త్రంలో విజయనగరానికి చెందిన ఇంజమూరి వెంకటసాయి మణికంఠ రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు.
మణికంఠ, లోకేశ్వరి, సాద్విక, పురుషోత్తంరావు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ఎడ్సెట్-24 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జీవశాస్త్రంలో విజయనగరానికి చెందిన ఇంజమూరి వెంకటసాయి మణికంఠ రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించాడు. గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం విభాగాల్లో విద్యార్థులు మంచి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. గణితంలో పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సంతోషపురానికి చెందిన సిరికి వెంకటసాయి అయిదో ర్యాంకు, భౌతికశాస్త్రంలో గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఈశ్వరరావుకు నాలుగో ర్యాంకు, గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన జి.నారాయణకు అయిదో ర్యాంకు, విజయనగరానికి చెందిన సంతోష్కుమార్కు పదో ర్యాంకు దక్కాయి.
బయాలజీలో లోకేశ్వరికి ఐదో ర్యాంకు
గజపతినగరం: జంతుశాస్త్ర విభాగంలో గజపతినగరం మండలం జిన్నాం గ్రామానికి చెందిన మంత్రి లోకేశ్వరికి 84 మార్కులతో 5వ ర్యాంకు లభించింది. ఈమె తండ్రి గోవిందరావు, తల్లి లక్ష్మి. వ్యవసాయ కుటుంబం. ఉపాధ్యాయురాలిగా స్థిరపడి, విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని ఈ విద్యార్థిని చెబుతోంది.
మరడాం విద్యార్థి సత్తా..
దత్తిరాజేరు: మరడాం గ్రామానికి చెందిన ముగడ పురుషోత్తంరావు సాంఘిక శాస్త్ర విభాగంలో 87/100 మార్కులతో పదో ర్యాంకు సాధించాడు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ హెచ్ఈపీ చదివాడు. ప్రస్తుతం ఎస్.కోటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సాధన చేస్తున్నాడు. తండ్రి వ్యవసాయ కూలీ.
సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతా..
కొత్తవలస: పట్టణంలోని డ్రైవర్ల కాలనీకి చెందిన నౌడు సాద్విక కంప్యూటర్ సైన్స్లో 74 మార్కులతో ఆరో ర్యాంకు పొందింది. ఏయూలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి సాఫ్ట్వేర్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కష్టపడతానని ఆమె చెబుతోంది. తండ్రి సింహాద్రప్పడు లారీ చోదకుడు. తల్లి ఆశాజ్యోతి గృహిణి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 01-07-2024]
బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది. -
పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. -
డెంగీ వ్యతిరేక మాసోత్సవ అవగాహన ర్యాలీ
[ 01-07-2024]
డెంగీ వ్యాధిని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట పీహెచ్సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి అన్నారు. -
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
లెదర్ ఫినిష్తో రియల్మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి