కక్షతో చంపేంత పనిచేశారు
శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటకు చెందిన గౌతమ్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజాం, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటకు చెందిన గౌతమ్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్సై శంకర్తో కలిసి సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. గురవాంకు చెందిన కె.నవీన్ బృందానికి గొల్లవీధికి చెందిన యువకులకు మధ్య ఈనెల 25న స్థానికంగా గొడవ జరిగింది. గొల్లవీధికి చెందిన యువకులు తప్పించుకుని ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. వీరిలో గౌతమ్, కార్తీక్ ఒకే బైక్పై ఉన్నారు. వెంటాడిన నవీన్.. గౌతమ్పై ఉమ్మేయడంతో అతడు ప్రశ్నించాడు. దీంతో తన స్నేహితులతో కలిసి కర్రలు, కత్తులతో దాడికి యత్నించాడు. బైక్తో సహా అతడ్ని పాలకొండ రహదారిలోని మామిడి తోటల్లోకి తీసుకెళ్లారు. దుస్తులు విప్పి ప్లాస్టిక్ పైపులు, బెల్టుతో చావగొట్టారు. బెల్టును గొంతుకు బిగించి హత్యాయత్నానికి ఒడిగట్టారు. జనం అలికిడితో సమీపంలోని కొర్లవలస కూడలికి తీసుకెళ్లారు. ఈలోపు మిగిలిన బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెళ్లేసరికి.. రోడ్డుపై వదిలేసి నిందితులు పరారయ్యారు. బాధితుడ్ని రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 14 మంది నిందితులున్నట్లు గుర్తించారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. 11 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులపై హత్యాయత్నంతో పాటు, ఇతర నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.