అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని..కిడ్నాప్ చేసి మూత్రం తాగించారు!
మహిళలకు అసభ్యకరమైన సందేశాలు ఫోన్ ద్వారా పంపుతున్నాడని కోపంతో నగరానికి చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి అతడికి మూత్రం తాగించి..
నిందితులంతా రాజస్థాన్ వాసులు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ బి.వెంకటరావు
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: మహిళలకు అసభ్యకరమైన సందేశాలు ఫోన్ ద్వారా పంపుతున్నాడని కోపంతో నగరానికి చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి అతడికి మూత్రం తాగించి.. విడిచిపెట్టి.. ఆ దృశ్యాలను సోషల్ మీడియా పెట్టిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు వివరాలను ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు మంగళవారం రాత్రి వెల్లడించారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక వ్యాపారి నగరంలో స్టీల్, స్టౌ మెటల్ వ్యాపారం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ఆయన స్వగ్రామానికి చెందిన బిజలా రాం, మరికొందరు ఈ నెల 14న విజయనగరం వచ్చారు. వ్యాపారితో మాట్లాడి కారులో ఎక్కించుకుని వై-కూడలి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడాక అందరూ కలిసి మద్యం తాగారు. తమ ఆడవారికి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే నెపంతో వ్యాపారిని తీవ్రంగా కొట్టి బలవంతంగా కారులో బెంగుళూరు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో కారు ఆపి, ఒక బాటిల్లో మూత్రం పట్టి వ్యాపారితో బలవంతంగా తాగించి, దాన్ని వీడియో తీశారు. అతడి స్నేహితుడికి ఫోన్ చేయించి, అతడి నుంచి బలవంతంగా రూ.35 వేలు తీసుకొని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి విడిచిపెట్టి పరారయ్యారు. వ్యాపారి ఇంటికి చేరుకొని ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. మూత్రం తాగించిన దృశ్యాలు రాజస్థాన్ సోషల్ మీడియాలో రావడంతో ఈ నెల 22న బాధితుడు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరైన దేవాసీ నజీరాంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మిగిలిన నిందితులైన బిజలా రాం, దిలీప్లను త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ బి.వెంకటరావు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ఎస్సై తారకేశ్వరరావు ప్రతిభ చూపారని సీఐ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్నాథ నీ ఆస్తులేవి
[ 29-06-2024]
ఆస్తులున్నా పాలకొండలో జగన్నాథస్వామికి పస్తులు తప్పడం లేదు. వందల ఎకరాల్లో ఉన్న పంట భూములు కాలక్రమేణా కరిగిపోయాయి. -
78 వేల ఎకరాలకు తోటపల్లి జలాలు
[ 29-06-2024]
తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. -
రైల్వే గేట్లు తొలగించాలని వినతి
[ 29-06-2024]
కొమరాడ మండలంలోని అర్తాం నుంచి కోటిపాం వరకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు రైల్వేగేట్ల సమస్యను పరిష్కరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం దిల్లీలో ఆ శాఖ ఓఎస్డీ వేదప్రకాశ్ను కలిసి వినతిపత్రం అందించారు. -
రహదారులకు మోక్షం
[ 29-06-2024]
గత అయిదేళ్లలో నిర్వహణకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారిన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు, జరిమానా
[ 29-06-2024]
మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను మునుపటిలా లేను కానీ..: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ