29 కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం రైల్వే స్టేషన్లో జీఆర్పీˆ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న రైల్వే జీఆర్పీ సీఐ వెంకటరావు
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: విజయనగరం రైల్వే స్టేషన్లో జీఆర్పీˆ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో పెట్టుకొని ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన అన్షు, శివ రైలు కోసం వేచి ఉండగా దొరికిపోయారు. వీరికి గంజాయి కొనుగోలు చేసి ఇచ్చి, జాగ్రత్తగా ఆగ్రా చేర్చాలని దిల్లీకి చెందిన ఒకరు బేరం కుదుర్చుకున్నట్లు సీఐ వెంకటరావు తెలిపారు. వీరు దొరికిపోవడంతో అతడు పరారయ్యాడని, ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీరిని రిమాండ్కు తరలించామని ఎస్ఐ రవివర్మ తెలిపారు. రైళ్లల్లో గంజాయి రవాణా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు.
పురుగు మందు తాగి ఉద్యోగి బలవన్మరణం
పూసపాటిరేగ, న్యూస్టుడే: మండలంలోని వెల్దూరు గ్రామానికి చెందిన బాకి అర్జున్ రెడ్డి(38) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీలో అర్జున్ రెడ్డి పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. గత రెండు రోజల నుంచి ఇంటికి రాకపోవడంతో అంతటా వెతికిన జాడ లేదు. గ్రామ సమీపంలో ఓ తోటలో పురుగు మందు తాగి మృతి చెంది ఉన్నట్లు మంగళవారం గుర్తించారు. ఘటన స్థలానికి ఎస్ఐ సన్యాసినాయుడు వెళ్లి పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భోగాపురం సీహెచ్సీకి తరలించారు. మృతుని తల్లి సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇతనికి భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
దొంగతనం నేరంలో ఇద్దరి అరెస్టు
కొత్తవలస, న్యూస్టుడే: మండలంలోని గులివిందాడ సమీపంలో హరిత రహదారి పనులు చేస్తున్న ఎన్కేసీ ప్రాజెక్టుకు చెందిన పొక్లెయిన్ సామగ్రిని అపహరించిన కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి మంగళవారం తరలించినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. విశాఖ జిల్లా భీమన్నదొరపాలెం పంచాయతీ శివారు బంటుమెరకకి చెందిన రౌతు అప్పలరాజు, బంటు గోవిందరాజు, మరో ఇద్దరు కలసి 24న రాత్రి చోరీకి పాల్పడ్డారన్నారు. రూ.లక్ష విలువచేసే సొత్తును ఆటోలో తరలిస్తుండగా ఇద్దరిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తవలస కోర్టులో నిందితుల్ని హాజరుపర్చగా.. న్యాయమూర్తి విజయచందర్ వారికి 15 రోజులు రిమాండు విధించినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ఉద్యోగ విరమణ సత్కారం
[ 29-06-2024]
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ సబార్డినేట్ కొప్పర దుర్గారావు ఉద్యోగ విరమణ సత్కరా కార్యక్రమం స్థానిక కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. -
వేణుగోపాలుడికి పుష్పాలంకరణ
[ 29-06-2024]
మండలంలోని చిలకలపల్లి వేణుగోపాలస్వామికి ఆలయ అర్చకులు కంచర్ల రాంబాబు వివిధ రకాల పుష్పాలు, దళాలతో శనివారం అలంకరించారు. -
శిథిల భవనం తొలగించాలని వినతి
[ 29-06-2024]
వీరఘట్టం మండలం దసుమంతపురం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శిథిల స్థితిలో ఉన్న అదనపు తరగతి భవనం తొలగించాలని ఎంఈవో గౌరు నాయుడుకు పలువురు స్థానికులు శనివారం వినతిపత్రం అందజేశారు. -
రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ప్రారంభిస్తాం
[ 29-06-2024]
రైతులకు మేలు చేసే కార్యక్రమాలనే తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. -
జగన్నాథ నీ ఆస్తులేవి
[ 29-06-2024]
ఆస్తులున్నా పాలకొండలో జగన్నాథస్వామికి పస్తులు తప్పడం లేదు. వందల ఎకరాల్లో ఉన్న పంట భూములు కాలక్రమేణా కరిగిపోయాయి. -
78 వేల ఎకరాలకు తోటపల్లి జలాలు
[ 29-06-2024]
తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. -
రైల్వే గేట్లు తొలగించాలని వినతి
[ 29-06-2024]
కొమరాడ మండలంలోని అర్తాం నుంచి కోటిపాం వరకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు రైల్వేగేట్ల సమస్యను పరిష్కరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం దిల్లీలో ఆ శాఖ ఓఎస్డీ వేదప్రకాశ్ను కలిసి వినతిపత్రం అందించారు. -
రహదారులకు మోక్షం
[ 29-06-2024]
గత అయిదేళ్లలో నిర్వహణకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారిన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు, జరిమానా
[ 29-06-2024]
మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM