ఆర్భాటమే మిగులు.. ఆచరణ కానరాలేదు
వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాన్ని తీసుకువచ్చి సాగు ఖర్చులు తగ్గిస్తామని, డ్రోన్ల విధానంతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని గత వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.
ప్రారంభం కాని కిసాన్ డ్రోన్ సేవ
అమలులో విఫలమైన వైకాపా
డ్రోన్ల వినియోగంపై యువతకు వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ ఇస్తున్న దృశ్యం (పాతచిత్రం)
బొబ్బిలి, పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాన్ని తీసుకువచ్చి సాగు ఖర్చులు తగ్గిస్తామని, డ్రోన్ల విధానంతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని గత వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. రెండు ఖరీఫ్ సీజన్లు పూర్తయినా ఇంతవరకు డ్రోన్ల జాడలేదు. ప్రయోగాత్మకంగా ప్రతి మండలంలోనూ వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పుకొచ్చింది. అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ కూడా ఇచ్చింది. మూడో ఖరీఫ్ ఆసన్నమైనా ఎక్కడా అమలు కాకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం ఇది
ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు డ్రోన్లు అవసరమని గుర్తించారు. మండలాల వారీ సుమారు 40 మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. అక్కడితో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. పెరిగిన సాగు ఖర్చులు.. ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ సమయంలో కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ల విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎకరా పొలానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేయాలంటే ఇద్దరు కూలీలు అవసరం. రోజంతా పనే. అదే డ్రోన్ సాయంతో అయితే 20 నుంచి 25 నిమిషాల్లో పిచికారీ పూర్తవుతుంది. అంతేకాదు సాధారణ స్ప్రేయరుతో అయితే.. తరచూ ట్యాంకు నింపాలి.. అదే మోతాదులో మందు కలపాలి.. అనుభవం ఉన్న కూలీలు అవసరం. కానీ డ్రోన్ టెక్నాలజీËతో సేద్యం సులభతరం. దీన్ని ఇప్పటికైనా అమలులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
అన్నీ అడ్డంకులే..
రైతులతో సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ సేవలను అమలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంఘాలకు డ్రోన్లు బ్యాంకు రుణంతో అందజేసి.. అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపకల్పన చేశారు. తద్వారా వచ్చే ఆదాయంతో కమిటీల నిర్వహణ, బలోపేతం చేయాలన్నది ఉద్దేశం. ఆరంభంలోనే అమలుకు కొన్ని సమస్యలు అడ్డంకిగా నిలిచాయి. సంఘాల్లో డ్రోన్ ఆపరేట్ చేసే పైలట్ ఒకరు సభ్యులుగా ఉండాలన్న నిబంధనతో వ్యవసాయశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు. బీఎస్సీ (అగ్రికల్చర్), ఇంజినీరింగు పట్టభద్రులు, వ్యవసాయంలో డిప్లమా ఇంజినీరింగు చేసిన వారు పైలట్గా ఉండాలనడంతో అభ్యర్థుల వెతుకులాటలో పడి, ఎలాగో అర్హులను గుర్తించి వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. అయితే ప్రభుత్వం సకాలంలో డ్రోన్లు ఇవ్వక, సంఘాలు మార్జిన్ మనీ చెల్లించక పరికరాలు అందుబాటులోకి రాలేదు. ప్రతి మండలానికి ఒక డ్రోన్ ఇవ్వాలన్నది ఆలోచన.
చర్యలు చేపడుతున్నాం
డ్రోన్తో క్రిమిసంహారక మందులు పిచికారీతో సమయం, డబ్బు ఆదా అవుతుంది. సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం. ప్రభుత్వమే రుణాన్ని సమకూర్చి డ్రోన్లు ఇచ్చే ఆలోచనలో ఉంది. కొత్త ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది యువతకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చాం.
వీటీ రామారావు, రాబర్ట్ పాల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్నాథ నీ ఆస్తులేవి
[ 29-06-2024]
ఆస్తులున్నా పాలకొండలో జగన్నాథస్వామికి పస్తులు తప్పడం లేదు. వందల ఎకరాల్లో ఉన్న పంట భూములు కాలక్రమేణా కరిగిపోయాయి. -
78 వేల ఎకరాలకు తోటపల్లి జలాలు
[ 29-06-2024]
తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. -
రైల్వే గేట్లు తొలగించాలని వినతి
[ 29-06-2024]
కొమరాడ మండలంలోని అర్తాం నుంచి కోటిపాం వరకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు రైల్వేగేట్ల సమస్యను పరిష్కరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం దిల్లీలో ఆ శాఖ ఓఎస్డీ వేదప్రకాశ్ను కలిసి వినతిపత్రం అందించారు. -
రహదారులకు మోక్షం
[ 29-06-2024]
గత అయిదేళ్లలో నిర్వహణకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారిన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు, జరిమానా
[ 29-06-2024]
మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త