logo

Parvatipuram: ఘనంగా ఉద్యోగ విరమణ సత్కారం

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ సబార్డినేట్ కొప్పర దుర్గారావు ఉద్యోగ విరమణ సత్కరా కార్యక్రమం స్థానిక కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

Published : 29 Jun 2024 17:22 IST

వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ సబార్డినేట్ కొప్పర దుర్గారావు ఉద్యోగ విరమణ సత్కరా కార్యక్రమం స్థానిక కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కె. జయప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బాహూకరించారు. ఉప తహసీల్దార్లు చందక సత్యనారాయణ, కె.సూర్యారావు, ఆర్ఐ లక్షునాయుడు, ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పాలకొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి పల్ల సన్యాసిరావు, పార్వతీపురం మన్యం జిల్లా వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు మరడ సింహాచలం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని