logo

Parvatipuram: విద్యార్థికి బంగారుపతకం, అవార్డు

బలిజిపేటకు చెందిన చిరువ్యాపారి కోండ్రు సింహాచలం కుమారుడు కె.శివకుమార్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాన్పూరులో ఎంటెక్‌లో బంగారు పతకాన్ని, అవార్డును అందుకొన్నారు.

Published : 03 Jul 2024 19:40 IST

బలిజిపేట: బలిజిపేటకు చెందిన చిరువ్యాపారి కోండ్రు సింహాచలం కుమారుడు కె.శివకుమార్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాన్పూరులో ఎంటెక్‌లో బంగారు పతకాన్ని, అవార్డును అందుకొన్నారు. కాన్పూరు ఐఐటీలో నిర్వహించిన 57వ కాన్వొగేషన్‌లో ఎంటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగులో ప్రతిభ కనబర్చిన శివకుమార్‌కు మెహతా ఎంటెక్‌ గోల్డ్‌మెడల్‌ను ప్రొఫెసర్‌ వై.మూర్తి, యూఎస్‌ఏ ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు, కులపతుల చేతులమీదుగా అందజేశారు. అనంతరం శివకుమార్‌ తల్లిదండ్రులు సింహాచలం, లక్ష్మి, కుటుంబ సభ్యులను వారు అభినందించారు. శివకుమార్‌ బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలోని ఇంజినీరింగు అసిస్టెంట్‌గా పనిచేసి రెండేళ్ల కిందట సెలవుపై వెళ్లి కాన్పూరులోని ఐఐటీ ఎంటెక్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని