Parvatipuram: కాలువల ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపం
తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.
వీరఘట్టం: తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పనులు అవినీతిపరుల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. బ్రాంచి, పిల్ల కాలువలు, అప్టెక్ ఛానల్లో పూడికలు పేరుకుపోయాయని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో ఈ పనులు చేయించాలని ఏపీవో సత్యం నాయుడు, జలవనరుల శాఖ ఏఈ రాజేష్ను ఆదేశించారు. జగనన్న కాలనీ స్థలాల విక్రయాల్లో అవినీతి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయాలని తహసీల్దార్ జయప్రకాశ్ను కోరారు. వివరాలు అందుబాటులో లేవని తహసీల్దార్ చెప్పడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యనికి గురయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. పాలకొండ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, మండల తెదేపా అధ్యక్షుడు ఉదయాన ఉదయ భాస్కర్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసతులు మృగ్యం.. విద్యార్థులకు శాపం..
[ 06-07-2024]
సాలూరు మండలంలోని మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి పది వరకు తరగతులు ఉన్నా గదులు సరిపోవడం లేదు. ఇక నాలుగు తరగతులు వరండాల్లో నిర్వహిస్తున్నారు. -
విధుల్లోకి తీసుకోరూ..
[ 06-07-2024]
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులను ఈ ఏడాది విధుల్లోకి తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ డిమాండు చేశారు. -
ఇది అపోహల వరుస
[ 06-07-2024]
ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈకేవైసీ లేకపోతే ఇబ్బందులు పడతామేమోననే అపోహలతో మహిళలు -
ఖరీఫ్తో కొత్త వంగడాలు
[ 06-07-2024]
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆర్జీఎల్ రకం విత్తనాలను రైతులు పండిస్తున్నారు. వీటిని కూడా రాగోలు కేంద్రంలో రూపొందించారు. ఇవి తినేందుకు బాగున్నప్పటికీ కొంచెం ముతకగా ఉంటాయనే భావన ప్రజల్లో ఉంది. -
సిఫార్సు బదిలీలకు చెల్లుచీటీ
[ 06-07-2024]
గత ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల్లో సిఫార్సులకే పెద్దపీట వేసింది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు ఓ మాజీ మంత్రి రూ.కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. -
అడుగడుగునా అవాంతరాలు
[ 06-07-2024]
చీపురుపల్లిలో పూర్తికాని ఆర్వోబీ వాహనదారులకు ముప్పు తిప్పలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాకు వెళ్లేందుకు చీపురుపల్లిలోని విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారి కీలకం. -
అమ్మా.. నేనేం పాపం చేశా..
[ 06-07-2024]
జామి, వైద్యవిభాగం, న్యూస్టుడే: భీమసింగిలో తినుబండారాల దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళ శుక్రవారం ఉదయం స్థానిక ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్డు పక్కనున్న తుప్పల్లో నుంచి ఓ పసికందు ఏడుపు వినిపించింది. -
మృత్యుపాశాలకు చిక్కిన బంధం
[ 06-07-2024]
ఎన్నో ఇబ్బందులు పడి కుమార్తెకు వివాహం చేశారు.. అష్టకష్టాలకోర్చి కుమారుడ్ని చదివిస్తున్నారు.. ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకున్న తరుణంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్నారు.. -
రైలు ఢీకొని వ్యవసాయ కూలీ మృత్యువాత
[ 06-07-2024]
గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ ఈశ్వరరావు వివరాల మేరకు గొల్లాది గ్రామానికి చెందిన ఎం.పోలీసు(48) శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో పొలం పనులకు వెళ్లేందుకు బయలుదేరారు. -
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
[ 06-07-2024]
అనారోగ్యం కారణంగా ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకొండలో చోటుచేసుకుంది. గారమ్మకాలనీకి చెందిన జి.మాధవి(34) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది.