logo

Crime news: రెండు వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్‌ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది.

Published : 01 Jul 2024 17:20 IST

బలిజిపేట: బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్‌ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న గీతనపల్లికి చెందిన చౌడు వెంకటస్వామి, మామిడి స్వామినాయుడు, బోను తవిటినాయుడులు తీవ్రంగా గాయపడ్డారు. సర్వరు సమస్యలు పరిష్కరించేందుకు బలిజిపేట ఆటోలో వచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగికి ఎలాంటి గాయాలు తగులలేదు. రక్తస్రావంతో బలిజిపేట పీహెచ్‌సీకి వచ్చిన క్షతగాత్రులకు అక్కడి వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం వీరిని బలిజిపేట పీహెచ్‌సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి రాజాం జీఎంఆర్‌ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. బలిజిపేట ఎస్సై పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని