logo

Odisha: పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత

అడవి నుంచి తీసుకొచ్చిన పుట్టగొడుగులను వంట చేసి తిన్న అనంతరం ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.

Published : 29 Jun 2024 17:32 IST

పర్లాఖెముండి: అడవి నుంచి తీసుకొచ్చిన పుట్టగొడుగులను వంట చేసి తిన్న అనంతరం ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గజపతి జిల్లా మోహన ఠాణాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మోహనా పంచాయతీ లదుర్మా గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పుట్టగొడుగులు తిన్న అనంతరం తలనొప్పి వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు వారిని మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని