Odisha: పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత
అడవి నుంచి తీసుకొచ్చిన పుట్టగొడుగులను వంట చేసి తిన్న అనంతరం ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.
పర్లాఖెముండి: అడవి నుంచి తీసుకొచ్చిన పుట్టగొడుగులను వంట చేసి తిన్న అనంతరం ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గజపతి జిల్లా మోహన ఠాణాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మోహనా పంచాయతీ లదుర్మా గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పుట్టగొడుగులు తిన్న అనంతరం తలనొప్పి వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు వారిని మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూలీ పనులకు వెళ్లి అనంత లోకాలకు
[ 01-07-2024]
జిల్లాలో వలస కార్మికురాలు మృతి చెందింది. కూలీ పని కోసం ఏపీలోని హైదరాబాద్కు వెళ్ళి కన్ను మూసింది. -
చివరి దశకు చేరుకున్న రథం పనులు
[ 01-07-2024]
జయపురం పట్టణంలో జగన్నాథుడి రథోత్సవం కోసం తయారవుతున్న రథాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. -
ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కేంద్ర మంత్రికి వినతిపత్రం
[ 01-07-2024]
కోరాపుట్ జిల్లా జయపురం నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వరకు విమానాన్ని నడపాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ వినతిపత్రం అందిచారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
[ 01-07-2024]
నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐఐటీ విద్యార్థులు ధర్నా చేశారు. -
యువకుడి దారుణ హత్య
[ 01-07-2024]
గంజాం జిల్లా గొలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాది కూడలి వద్ద ఆదివారం సాయంత్రం ఎ. బాలు (24) అనే యువకుడిని హత్య చేశారు. -
విషయవాయువు వెలువడి 8 మందికి అస్వస్థత
[ 01-07-2024]
భువనేశ్వర్లోని రవ్వల ఉమ్మక్ కర్మాగారంలో విషవాయువు వెలువడిన ఘటనలో 8మంది అస్వస్థతకు గురయ్యారు. -
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు సినిమా అనుకుంటే.. వరల్డ్ సినిమాను తీశారు: బ్రహ్మాజీ
-
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!
-
అమరావతిపై చంద్రబాబు సమీక్ష.. ఎల్లుండి శ్వేతపత్రం
-
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
-
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్: దామోదర రాజనర్సింహ
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?