స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు.
మోహన్చరణ్ అధ్యక్షతన సమన్వయ సంఘం భేటీ
ఉత్కళ ప్రమగ ఆవిష్కరిస్తున్న సీఎం, మంత్రులు, అధికారులు
గోపాలపూర్, న్యూస్టుడే: విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం పూరీ టౌన్హాల్ సమావేశంలో రథయాత్ర చివరి సమన్వయ సంఘ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కనకవర్థన్ సింగ్దేవ్, ప్రభాతిపరిడ, మంత్రులు బిభూతి భూషణ్ జెనా (వాణిజ్య, రవాణా, ఉక్కు, గనులు) పృథ్వీరాజ్ హరిచందన్ (న్యాయ), ముఖేష్ మహాలింగ (ఆరోగ్యం), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా, డీజీపీ అరుణ్షడంగి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, 36 తెగల (ఛత్తీసా నియోగ్) సేవాయత్ ప్రతినిధులు, సేవాసంఘాల కార్యకర్తలు, పాత్రికేయులు, ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ శ్రీక్షేత్రం కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి క్షేత్రమని, ఏడాదికోసారి జరిగే రథయాత్ర రాష్ట్ర ప్రతిష్ఠ, వైభవానికి అద్దం పడుతుందన్నారు. ఈసారి వేడుకలు తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తారన్న అంచనా ఉన్నందున అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వైద్యసేవలు, మంచినీటి సరఫరా, వసతి, రాకపోకలు, భద్రతకు పెద్దపీట వేయాలన్నారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, వీవీఐపీలు పెద్దసంఖ్యలో వస్తున్నందున ఏర్పాట్లలో లోపాలు లేకుండా పర్యవేక్షించే బాధ్యత అధికారులు, పోలీసులు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు, పాత్రికేయులు
నిష్ఠగా స్వామిసేవలు చేయాలి
జగన్నాథుని సేవలు నిష్ఠ, అంకితభావంతో చేపట్టాలని సీఎం సేవాయత్లను కోరారు. ఈసారి పురుషోత్తముని నవయవ్వన అవతారం, నేత్రోత్సవం రథయాత్ర ఒకరోజు నిర్వహించాల్సి ఉండగా సేవాయత్లపై అదనపు భారం ఉంటుందని, సమన్వయంతో సకాలంలో అన్నీ చేపట్టాలన్నారు. పురుషోత్తముని సేవలపైనే యాత్ర ఆధారపడినందున అపశృతులకు తావీయరాదన్నారు.
రథయాత్ర ప్రత్యేక సంచిక విడుదల
ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక సమాచార, పౌరసంబంధాలశాఖలు సంయుక్తంగా ముద్రించిన ‘ఉత్కళ ప్రమగ’ (రథయాత్ర ప్రత్యేక సంచిక) సీఎం, ఇతర మంత్రులు, అధికారులు వేదికపై విడుదల చేశారు. ప్రతులు రథయాత్ర నాడు పూరీలో చౌకధరలకు విక్రయిస్తారు.
గుండిచా మందిరం వద్ద ప్రదర్శన
సమావేశానంతరం మోహన్చరణ్ విలేకరులతో మాట్లాడుతూ రథయాత్ర జరిగే 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నామన్నారు. గుండిచా మందిరం వద్ద రథయాత్ర నుంచి తిరుగుయాత్ర వరకు సాంస్కృతిక శాఖ భక్తులు, యాత్రికుల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రదర్శన చేడుతుందన్నారు. న్యాయశాఖ మంత్రి హరిచందన్ మాట్లాడుతూ... ఘోషయాత్రనను ప్రతిష్ఠగా తీసుకున్న ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రథాలకు తుది మెరుగులు
[ 06-07-2024]
నందిఘోష్ (జగన్నాథుని), బలభద్రుని (తాళధ్వజ), దేవీ సుభద్ర (దర్పదశళన్) రథాల తయారీ పనులు పూర్తయ్యాయి. ముగ్గురు మూర్తుల రథాల అలంకరణలో చిత్రకార్, రూపకార్, దర్జీ సేవాయత్లు తలమునకలై ఉన్నారు. -
అక్కరకు రాని ఆవాస్ యోజన
[ 06-07-2024]
పేద ప్రజలకు నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) రాయగడ జిల్లాలో అక్కరకు రావడం లేదు. -
సంపద లెక్కింపునకు ప్రత్యేక కమిటీ
[ 06-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీ రద్దు చేసింది. ఈ కమిటీని మాజీ ముఖ్యమంత్రి నవీన్ హయాంలో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం లెక్కింపునకు నియమించారు. -
ముఖ్యమంత్రికి ఏబీవీ ఆహ్వానం
[ 06-07-2024]
బ్రహ్మపురానికి రావాలని ముఖ్యమంత్రి మోహన్ మాఝిని ఆంధ్ర భాషాభివర్ధనీ (ఏబీవీ) సమాజం అధ్యక్షుడు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు) తెలిపారు. -
లక్ష్మీపూర్లో ‘సంపూర్ణత అభియాన్’ప్రారంభం
[ 06-07-2024]
కేంద్ర ప్రభుత్వం పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో గురువారం రాత్రి ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రారంభించారు. -
సురేంద్రనాథ్ నాయక్ కన్నుమూత
[ 06-07-2024]
బిజు పట్నాయక్ మిత్రుడు, మాజీ మంత్రి సురేంద్రనాథ్ నాయక్ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే చికిత్స పొందారు. -
అభివృద్ధి తథ్యం: కేంద్రమంత్రి ధర్మేంద్ర
[ 06-07-2024]
డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి తథ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం సంబల్పూర్ పరిధిలోని కుచిందలో మంచినీటి సరఫరాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలమంత్రి రబినారాయణ నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. -
బంగాళాఖాతంలో ఆవర్తనం
[ 06-07-2024]
కేంద్ర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఆవర్తనం నెలకొందని, ఇది సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలమయ్యాయని గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
-
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ