మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీహెచ్సీ, పీహెచ్సీల్లో సీటీస్కాన్ సేవలు
పీపీపీ విధానం ద్వారా అమలుకు సర్కార్ నిర్ణయం
రోగికి సీటీ స్కాన్ పరీక్షలు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ విధానం అమలుకు సర్కార్ నిర్ణయించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత చేరువకానున్నట్లు సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీడియా ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం... సీహెచ్సీ, పీహెచ్సీల్లో ఈ సేవలు అందించే ప్రోవైడర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం నియమితులైన వైద్యులు, నిపుణుల అర్హత, ఇతర అంశాలతోపాటు ఈ సేవలందించేందుకు సంబంధిత వ్యక్తులు పూర్తి అర్హులా కాదా అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
వారంలోగా పంపించాలి
ఈ సేవలు సమకూర్చేందుకు నియమితులైనవారి పరిచయ, అర్హత పత్రాలను నిశితంగా పరిశీలించి వారం రోజుల్లోగా ఆరోగ్యశాఖకు పంపించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఆ దిశగా అన్ని జిల్లాల ముఖ్య వైద్యం, ప్రజారోగ్య శాఖ అధికారులు, రాష్ట్ర సంచాలకులు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. వీటిని పరిశీలించే సమయంలో సంబంధిత వైద్యులు, నిపుణులు ప్రత్యక్షంగా సీడీఎంపీహెచ్వోల ముందు హాజరు కావాలని అందులో స్పష్టం చేసింది. రాష్ట్రంలో చాలా జిల్లా కేంద్రాసుపత్రుల్లో సీటీస్కాన్ సేవలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం శుభపరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ జిల్లాగా పేరొందిన రాయగడలో ఇవి ప్రజలకు మరింత దోహదపడనున్నాయి. తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో వార్తల్లో నిలిచే కాశీపూర్, వెనుకబడిన సమితులుగా పేరొందిన చంద్రపూర్, మునిగుడకు ఈ విధానం అమలైతే ఎంతో ఉపయోగపడనున్నాయన్న వ్యాఖ్యలు అన్నిచోట్లా వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్ట గొడుగులు తిని నలుగురికి అస్వస్థత
[ 05-07-2024]
జిల్లాలోని పదహండి సమితి సాన్చార్జి పంచాయతీ బడబార్లి గ్రామానికి సమీపంలో నలుగురు అడవి పుట్టగొడుగులు తిన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
[ 05-07-2024]
కోరాపుట్ జిల్లా కుంద్ర సమితి రాణిగుడ గ్రామంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. -
మహిళా కోర్టు న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
[ 05-07-2024]
కొరాపుట్ జిల్లా కొట్టాడులో సివిల్, మహిళా కోర్టులో నూతన న్యాయమూర్తిగా అలకనందా మహంతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
యువకుడు ఆత్మహత్య
[ 05-07-2024]
జయపురం పట్టణంలో మదాల సాపీంలో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానిక ప్రాంతానికి చెందిన బిజియ్(29)గా గుర్తించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
[ 05-07-2024]
పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై టెంటు హోస్ ఉద్యోగి మృతి చెందాడు. -
స్వామి దర్శనానికి భక్తులకు అడ్డంకులొద్దు
[ 05-07-2024]
ఈసారి రథయాత్ర 1971 సంవత్సరం నిబంధనకు అనుగుణంగా రెండ్రోజులు జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు పూరీ చేరుకుంటారు. -
అధికారులు పట్టించుకోక... లోతట్టు ప్రాంతాలు మునక
[ 05-07-2024]
బ్రహ్మపుర.. దక్షిణ ఒడిశాలో ప్రధాన నగరం. 70 చదరపు కి.మీ. విస్తీర్ణంతో ఇక్కడ ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. -
మాతృభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం
[ 05-07-2024]
తమ ప్రభుత్వం మాతృభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యమిస్తుందని, పర (ఆంగ్లం) భాషలోని దస్త్రాలకు చెల్లు చీటి రాస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి చెప్పారు. -
భక్తులిచ్చిన బియ్యానికి పురుగులు పట్టించారు
[ 05-07-2024]
ఆరాధ్యదైవం జగన్నాథునికి భక్తులు సమర్పించుకున్న బియ్యం, నారికేళాలు, వక్కలు వినియోగానికి నోచుకోలేదు. బియ్యానికి గోదాములో పురుగులు పట్టాయి. దీంతో ప్రస్తుతం స్వామి ప్రసాదానికివి పనికి రావంటున్నారు సువార్ సేవాయత్లు. -
పర్యాటకరంగంపై నీలినీడలు
[ 05-07-2024]
రాయగడ జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధిపై నీలినీడలు అలుముకుంటున్నాయి. జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గతంలో చేసిన ప్రతిపాదనలు ఇంత వరకు కొలిక్కిరాలేదు. -
ప్రభుత్వ నిర్ణయం మేరకు భాండాగారం తెరుస్తాం: జస్టిస్ అర్జిత్ పసాయత్
[ 05-07-2024]
ప్రభుత్వం సూచించిన తేదీన పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం తెరుస్తామని, 8న రథాలు లాగే వేడుక కొనసాగనున్నందున సోమవారం తెరవడం సాధ్యం కాకపోవచ్చని రత్నభాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పసాయత్ చెప్పారు. -
స్వామికి ఘొనాలగి సేవలు
[ 05-07-2024]
ఆషాఢ బహుళ పక్షమి త్రయోదశిని పురస్కరించుకుని గురువారం శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో పురుషోత్తమునికి ఘొనాలగి సేవలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
-
కృష్ణాడెల్టాకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదు: మంత్రి నిమ్మల
-
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
-
బాధ్యత వహించినా.. సునాక్ కేవలం బాధితుడేనా!
-
యూకే ఎన్నికల ఫలితాలు.. రిషి సునాక్పై మోదీ పోస్టు
-
విభజన సమస్యలే అజెండా.. చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు