రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.
భద్రతపై అధికారులతో సీఎస్ సమీక్ష
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.
శనివారం సాయంత్రం రాక
శనివారం (6న) సాయంత్రం ద్రౌపదీ ముర్ము భువనేశ్వర్ చేరుకుంటారు. రాజ్భవన్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని జయదేవ్ భవన్కు వెళతారు. ఇక్కడ ఉత్కళమణి గోపబంధు దాస్ 96వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని రాజ్భవన్లో రాత్రి బస చేస్తారు. 7న పూరీ చేరుకొని రథయాత్ర తిలకిస్తారు. రాత్రి పూరీలోని రాజ్భవన్లో విశ్రాంతి తీసుకోనున్న రాష్ట్రపతి సోమవారం భువనేశ్వర్ వస్తారు. రాజధానిలో ఆమె ఖండగిరి, ఉదయగిరిలలో జైనుల పాలనాకాలంనాటి గుహలను తిలకిస్తారు. అనంతరం బిభూతికానుంగో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత భువనేశ్వర్లోని డిజైన్ రిట్రీట్ సెంటర్లో ఏర్పాటయ్యే మరో కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి రాజ్భవన్లో విశ్రాంతి తీసుకుని మంగళవారం మధ్యాహ్నం భువనేశ్వర్ నైజర్ విద్యాసంస్థ 13వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. సాయంత్రం దిల్లీ ప్రయాణమవుతారు.
ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
గట్టి బందోబస్తు
రాష్ట్రపతి పాల్గొననున్న కార్యక్రమాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రణ తదితరాలపై దృష్టి సారించినట్లు డీజీపీ అరుణ్ షడంగి వివరించారు. పాత్రికేయులు వార్తల కవరేజీకి సంబంధించి ప్రత్యేక ‘ఐ’కార్డులు జారీచేస్తున్నామని ఆయాచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఐఅండ్పీఆర్ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సింగ్ చెప్పారు. పూరీ రథయాత్ర తిలకించనున్న రాష్ట్రపతి ఆసీనులయ్యే ప్రాంతాన్ని కార్డన్గా చేస్తున్నామని, ఇక్కడికి ఎవరూ ప్రవేశించకుండా బందోబస్తు ఉంటుందని, బీచ్లో ఆమె మార్నింగ్వాక్ చేసే సమయంలోనూ ఆయాచోట్ల బలగాలను నియమిస్తున్నట్లు సెక్యూరిటీ ఐజీ సంజయ్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రథాలకు తుది మెరుగులు
[ 06-07-2024]
నందిఘోష్ (జగన్నాథుని), బలభద్రుని (తాళధ్వజ), దేవీ సుభద్ర (దర్పదశళన్) రథాల తయారీ పనులు పూర్తయ్యాయి. ముగ్గురు మూర్తుల రథాల అలంకరణలో చిత్రకార్, రూపకార్, దర్జీ సేవాయత్లు తలమునకలై ఉన్నారు. -
అక్కరకు రాని ఆవాస్ యోజన
[ 06-07-2024]
పేద ప్రజలకు నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) రాయగడ జిల్లాలో అక్కరకు రావడం లేదు. -
సంపద లెక్కింపునకు ప్రత్యేక కమిటీ
[ 06-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీ రద్దు చేసింది. ఈ కమిటీని మాజీ ముఖ్యమంత్రి నవీన్ హయాంలో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం లెక్కింపునకు నియమించారు. -
ముఖ్యమంత్రికి ఏబీవీ ఆహ్వానం
[ 06-07-2024]
బ్రహ్మపురానికి రావాలని ముఖ్యమంత్రి మోహన్ మాఝిని ఆంధ్ర భాషాభివర్ధనీ (ఏబీవీ) సమాజం అధ్యక్షుడు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు) తెలిపారు. -
లక్ష్మీపూర్లో ‘సంపూర్ణత అభియాన్’ప్రారంభం
[ 06-07-2024]
కేంద్ర ప్రభుత్వం పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో గురువారం రాత్రి ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రారంభించారు. -
సురేంద్రనాథ్ నాయక్ కన్నుమూత
[ 06-07-2024]
బిజు పట్నాయక్ మిత్రుడు, మాజీ మంత్రి సురేంద్రనాథ్ నాయక్ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే చికిత్స పొందారు. -
అభివృద్ధి తథ్యం: కేంద్రమంత్రి ధర్మేంద్ర
[ 06-07-2024]
డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి తథ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం సంబల్పూర్ పరిధిలోని కుచిందలో మంచినీటి సరఫరాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలమంత్రి రబినారాయణ నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. -
బంగాళాఖాతంలో ఆవర్తనం
[ 06-07-2024]
కేంద్ర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఆవర్తనం నెలకొందని, ఇది సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలమయ్యాయని గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.