త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు
బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది.
సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు
సోమవారం రాత్రి బిజద మహిళా శాఖ ప్రతినిధులతో నవీన్
భువనేశ్వర్, న్యూస్టుడే: బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. లోక్సభలో ఖాతా తెరవలేకపోయిన బిజద శాసనసభలో విపక్షానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ అయిదేళ్లు గట్టి కసరత్తు చేసి పార్టీకి పూర్వ వైభవం కల్పించే దిశగా నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.
అనుభవజ్ఞులకు ముఖ్య పోస్టులు
గతంలో నవీన్ వద్ద నెంబర్ టుగా చలామణి అయిన దివంగత ప్యారీమోహన్ మహాపాత్ర్ బిజదను కేడర్గల పార్టీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతలో నవీన్ లండన్ వెళ్లిన సమయంలో సీఎం పదవి చేజిక్కించుకోవడానికి కొంతమంది ఎమ్మెల్యేలతో అర్థరాత్రి ఆపరేషన్ చేపట్టి భంగపాటుకు గురై తెరమరుగయ్యారు. తర్వాత పాండ్యన్, బొబి పార్టీలో నవీన్ తర్వాత పెద్ద దిక్కుగా మారారు. సీనియర్ నేతలు నామమాత్రమయ్యారు. గడిచిన అయిదేళ్లు నవీన్కు, నేతలకు మధ్య దూరం పెరిగింది. ఎన్నికల్లో ఆయాప్రాంతాల సీనియర్ నాయకులు సూచనలు పరిగణలోకి తీసుకోకుండా పాండ్యన్ తెరవెనుక ఉండి టిక్కెట్లు కేటాయించారు. ఇది పార్టీకి నష్టం మిగిల్చింది. ఈసారి అనుభవజ్ఞలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
అధ్యక్షునిగా మళ్లీ నవీనే
బిజద పరాజయం పాలైన తర్వాత నవీన్ మేలుకున్నారు. ఆయన వద్దకు జిల్లాలవారీగా నిత్యం నేతలొచ్చి కలుస్తున్నారు. అందరితో స్వయంగా మాట్లాడుతున్న నవీన్ వారి సూచనలు పరిశీలిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. త్వరలో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలిచ్చారు. నవీన్ మళ్లీ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఉత్తరకోస్తా, దక్షిణ, పశ్చిమ ఒడిశా జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమితులయ్యే అవకాశం ఉంది.
పార్టీ బలోపేతం చేస్తాం
బిజద ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్ మిశ్ర సోమవారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడతూ పార్టీని బలోపేతం చేయడానికి నవీన్ సంకల్పించారని, సంస్థాగత ఎన్నికల తర్వాత కేడర్ గల పార్టీగా అవతరిస్తుందని పేర్కొన్నారు. అనుభవజ్ఞ్ఞుల సూచనల మేరకు శ్రేణులు ప్రజలతో మమేకమవుతాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రథాలకు తుది మెరుగులు
[ 06-07-2024]
నందిఘోష్ (జగన్నాథుని), బలభద్రుని (తాళధ్వజ), దేవీ సుభద్ర (దర్పదశళన్) రథాల తయారీ పనులు పూర్తయ్యాయి. ముగ్గురు మూర్తుల రథాల అలంకరణలో చిత్రకార్, రూపకార్, దర్జీ సేవాయత్లు తలమునకలై ఉన్నారు. -
అక్కరకు రాని ఆవాస్ యోజన
[ 06-07-2024]
పేద ప్రజలకు నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) రాయగడ జిల్లాలో అక్కరకు రావడం లేదు. -
సంపద లెక్కింపునకు ప్రత్యేక కమిటీ
[ 06-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీ రద్దు చేసింది. ఈ కమిటీని మాజీ ముఖ్యమంత్రి నవీన్ హయాంలో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం లెక్కింపునకు నియమించారు. -
ముఖ్యమంత్రికి ఏబీవీ ఆహ్వానం
[ 06-07-2024]
బ్రహ్మపురానికి రావాలని ముఖ్యమంత్రి మోహన్ మాఝిని ఆంధ్ర భాషాభివర్ధనీ (ఏబీవీ) సమాజం అధ్యక్షుడు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు) తెలిపారు. -
లక్ష్మీపూర్లో ‘సంపూర్ణత అభియాన్’ప్రారంభం
[ 06-07-2024]
కేంద్ర ప్రభుత్వం పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో గురువారం రాత్రి ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రారంభించారు. -
సురేంద్రనాథ్ నాయక్ కన్నుమూత
[ 06-07-2024]
బిజు పట్నాయక్ మిత్రుడు, మాజీ మంత్రి సురేంద్రనాథ్ నాయక్ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే చికిత్స పొందారు. -
అభివృద్ధి తథ్యం: కేంద్రమంత్రి ధర్మేంద్ర
[ 06-07-2024]
డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి తథ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం సంబల్పూర్ పరిధిలోని కుచిందలో మంచినీటి సరఫరాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలమంత్రి రబినారాయణ నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. -
బంగాళాఖాతంలో ఆవర్తనం
[ 06-07-2024]
కేంద్ర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఆవర్తనం నెలకొందని, ఇది సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలమయ్యాయని గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.