కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను
సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు.
మూతపడిన పాఠశాలలు తెరిపిస్తాం
ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద
నిత్యానంద గొండొ
భువనేశ్వర్, న్యూస్టుడే: సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. మంగళవారం భువనేశ్వర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనుందని, సామాజిక భద్రత కార్యక్రమానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో పరిశీలిస్తామని, ఆర్థికశాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత పెంచిన పింఛన్లు చెల్లిసామన్నారు. రూ.500లుగా ఉన్న ఈ పింఛను మొత్తాన్ని గత ప్రభుత్వం రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. భాజపా అధికారంలోకి వస్తే దీనిని రూ.3000 చేస్తామన్న ఆ పార్టీ నేతలు 100 రోజుల్లో పెంచిన మొత్తం ఇస్తామన్నారు.
పరిశీలన జరుగుతోంది
విద్యార్థుల సంఖ్య తగ్గిందన్న కారణంతో గత ప్రభుత్వం చాలాచోట్ల ప్రాథమిక పాఠశాలలు మూసేసిందని, ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ పాఠశాలలు మూతపడ్డాయని నిత్యానంద చెప్పారు. విద్యార్థుల సంఖ్య తగ్గలేదని, ఉద్దేశపూర్వకంగా మూసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనిపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని మంత్రి చెప్పారు. త్వరలో ఇలాంటి స్కూళ్లను తెరిపించి ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రథాలకు తుది మెరుగులు
[ 06-07-2024]
నందిఘోష్ (జగన్నాథుని), బలభద్రుని (తాళధ్వజ), దేవీ సుభద్ర (దర్పదశళన్) రథాల తయారీ పనులు పూర్తయ్యాయి. ముగ్గురు మూర్తుల రథాల అలంకరణలో చిత్రకార్, రూపకార్, దర్జీ సేవాయత్లు తలమునకలై ఉన్నారు. -
అక్కరకు రాని ఆవాస్ యోజన
[ 06-07-2024]
పేద ప్రజలకు నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) రాయగడ జిల్లాలో అక్కరకు రావడం లేదు. -
సంపద లెక్కింపునకు ప్రత్యేక కమిటీ
[ 06-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీ రద్దు చేసింది. ఈ కమిటీని మాజీ ముఖ్యమంత్రి నవీన్ హయాంలో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం లెక్కింపునకు నియమించారు. -
ముఖ్యమంత్రికి ఏబీవీ ఆహ్వానం
[ 06-07-2024]
బ్రహ్మపురానికి రావాలని ముఖ్యమంత్రి మోహన్ మాఝిని ఆంధ్ర భాషాభివర్ధనీ (ఏబీవీ) సమాజం అధ్యక్షుడు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు) తెలిపారు. -
లక్ష్మీపూర్లో ‘సంపూర్ణత అభియాన్’ప్రారంభం
[ 06-07-2024]
కేంద్ర ప్రభుత్వం పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో గురువారం రాత్రి ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రారంభించారు. -
సురేంద్రనాథ్ నాయక్ కన్నుమూత
[ 06-07-2024]
బిజు పట్నాయక్ మిత్రుడు, మాజీ మంత్రి సురేంద్రనాథ్ నాయక్ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే చికిత్స పొందారు. -
అభివృద్ధి తథ్యం: కేంద్రమంత్రి ధర్మేంద్ర
[ 06-07-2024]
డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి తథ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం సంబల్పూర్ పరిధిలోని కుచిందలో మంచినీటి సరఫరాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలమంత్రి రబినారాయణ నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. -
బంగాళాఖాతంలో ఆవర్తనం
[ 06-07-2024]
కేంద్ర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఆవర్తనం నెలకొందని, ఇది సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలమయ్యాయని గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.