జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స
పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.
కోలుకున్న స్వామి... రథాలకు ముస్తాబు
శ్రీక్షేత్రానికి తెచ్చిన దశమూలికా గుళికలు
గోపాలపూర్, న్యూస్టుడే: పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు. 11 రోజులుగా అస్వస్థతకు గురైన పురుషోత్తమునికి వస్త్రాలు మార్చలేదు. తులసి, సుగంధ పుష్పాలతో అలంకరణ చేయించుకునే స్వామికి ఇంతవరకు తెలుపు నందివర్దనం పూలు మాత్రమే మాలకట్టి మెడలో వేశారు. స్వామి కోలుకున్న నేపథ్యంలో ధరింపజేసిన వస్త్రాలు మార్చారు. ఆనవాయితీ ప్రకారం ఏకాదశినాడు తులసిమాల ధరింపజేశారు. రాజవైద్యుల సూచనల మేరకు ఆయుర్వేద వైద్యులు తయారుచేసిన దశమూలికా గుళికలు అర్పించారు. పాలమీగడ, జున్ను, పంచామృతం, పళ్లు నైవేథ్యంగా పెట్టారు. దీంతో చతుర్థామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు పూర్తిగా కోలుకున్నారు. బుధవారం నుంచి శ్రీక్షేత్రంలో సందడి ప్రారంభం కానుంది.
జగన్నాథుని నందిఘోష్ రథాలంకరణకు సిద్ధమవుతున్న చిలకల బొమ్మలు
ముమ్మరంగా పనులు
ఆదివారం విశ్వప్రసిద్ధ రథయాత్ర నిర్వహించనుండగా నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాల తయారీ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అలంకరణ పనులు ముమ్మరమయ్యాయి. మహరణా, దర్జీ, చిత్రకార్, రూప్కార్ సేవాయత్లు రాత్రి వరకు స్వామిసేవ నిష్ఠగా నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రంనాటికి మూడురథాలు సిద్ధమవుతాయని ప్రధాన విశ్వకర్మ సేవాయత్ బిజయ్ మహాపాత్ర్ మంగళవారం విలేకరులకు చెప్పారు.
శ్రీక్షేత్రం వద్ద సిద్ధమైన రథాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రథాలకు తుది మెరుగులు
[ 06-07-2024]
నందిఘోష్ (జగన్నాథుని), బలభద్రుని (తాళధ్వజ), దేవీ సుభద్ర (దర్పదశళన్) రథాల తయారీ పనులు పూర్తయ్యాయి. ముగ్గురు మూర్తుల రథాల అలంకరణలో చిత్రకార్, రూపకార్, దర్జీ సేవాయత్లు తలమునకలై ఉన్నారు. -
అక్కరకు రాని ఆవాస్ యోజన
[ 06-07-2024]
పేద ప్రజలకు నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) రాయగడ జిల్లాలో అక్కరకు రావడం లేదు. -
సంపద లెక్కింపునకు ప్రత్యేక కమిటీ
[ 06-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి జస్టిస్ అర్జిత్ పసాయత్ కమిటీ రద్దు చేసింది. ఈ కమిటీని మాజీ ముఖ్యమంత్రి నవీన్ హయాంలో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం లెక్కింపునకు నియమించారు. -
ముఖ్యమంత్రికి ఏబీవీ ఆహ్వానం
[ 06-07-2024]
బ్రహ్మపురానికి రావాలని ముఖ్యమంత్రి మోహన్ మాఝిని ఆంధ్ర భాషాభివర్ధనీ (ఏబీవీ) సమాజం అధ్యక్షుడు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు) తెలిపారు. -
లక్ష్మీపూర్లో ‘సంపూర్ణత అభియాన్’ప్రారంభం
[ 06-07-2024]
కేంద్ర ప్రభుత్వం పథకం నీతి ఆయోగ్ ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో గురువారం రాత్రి ఎమ్మెల్యే పవిత్ర శాంత ప్రారంభించారు. -
సురేంద్రనాథ్ నాయక్ కన్నుమూత
[ 06-07-2024]
బిజు పట్నాయక్ మిత్రుడు, మాజీ మంత్రి సురేంద్రనాథ్ నాయక్ (93) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే చికిత్స పొందారు. -
అభివృద్ధి తథ్యం: కేంద్రమంత్రి ధర్మేంద్ర
[ 06-07-2024]
డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి తథ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శుక్రవారం సంబల్పూర్ పరిధిలోని కుచిందలో మంచినీటి సరఫరాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలమంత్రి రబినారాయణ నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. -
బంగాళాఖాతంలో ఆవర్తనం
[ 06-07-2024]
కేంద్ర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఆవర్తనం నెలకొందని, ఇది సముద్ర ఉపరితలంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు క్రియాశీలమయ్యాయని గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.