వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు.
భాజపా విజయోత్సవంలో నేతల స్పష్టీకరణ
వేదికపై సీఎంకు మొక్క బహూకరిస్తున్న మన్మోహన్ సామల్. చిత్రంలో కేంద్ర మంత్రులు
భువనేశ్వర్, న్యూస్టుడే: ‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం భువనేశ్వర్ ప్రదర్శనా మైదానంలో ఆ పార్టీ విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్చరణ మాఝి, ఉపముఖ్యమంత్రులు కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడ, మంత్రివర్గ సహచరులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ (విద్య), అశ్వినీ వైష్ణవ్ (రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సమాచార), జోయల్ ఓరం (గిరిజన సంక్షేమం), పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తదితరులు పాల్గొన్నారు.
వలసలు నివారిస్తాం
సీఎం మోహన్ మాట్లాడుతూ... అన్నదాతలు, యువత, మహిళలు ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని, నిర్మాణ రంగం పరుగులు తీయించి వలసలు నివారిస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుందన్నారు. పూరీ జగన్నాథుని రత్నభాండాగారం సంపద లెక్కింపులో అక్రమాలు జరిగుంటే బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు
రైల్వే మంత్రి అశ్వినీ మాట్లాడుతూ... పూరీ, భువనేశ్వర్ స్టేషన్లకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన జరుగుతోందన్నారు. రానున్న అయిదేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కింద రూ.లక్షకోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఆధారిత నిర్మాణాలు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
నిధులకు కొరత లేదు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర మాట్లాడుతూ... నిధులకు కొరత ఉండదని, ప్రతి పనికి మోదీ గ్యారంటీ ఉందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. కేంద్రమంత్రి జోయల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు మాట్లాడారు. వేదికపై భాజపా నాయకత్వం సీఎంను గజమాలతో సత్కరించింది నేతలంతా పరస్పరం అభినందించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం
[ 03-07-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. -
మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
[ 03-07-2024]
రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు
[ 03-07-2024]
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. -
త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు
[ 03-07-2024]
బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
భయపెడుతున్న డెంగీ
[ 03-07-2024]
రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను
[ 03-07-2024]
సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. -
జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స
[ 03-07-2024]
పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్