సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం.
టాప్-7 రాష్ట్రాల జాబితాలో మనకు చోటు
అమృత్ సరోవర్ కింద చేపడుతున్నచెరువు పనులు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. దిల్లీ ఆధారిత సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఆ నివేదిక ప్రకారం... దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో 75కిపైగా చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2022 ఏప్రిల్లో మిషన్ అమృత్ సరోవర్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యాన్ని అందిపుచ్చుకున్న ఒడిశా అన్ని జిల్లాల్లోనూ వీటిని పూర్తిచేసింది. 30 జిల్లాలున్న రాష్ట్రంలో 2,250 నీటి వనరుల ఏర్పాటు లక్ష్యం కాగా, 2,367 చెరువులను అభివృద్ధి చేయడం గమనార్హం. అత్యధికంగా 16,909 చెరువులతో యూపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమృత్ సరోవర్ లక్ష్యాలను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా ఉన్నాయి. మన రాష్ట్ర లక్ష్యాన్ని అందిపుచ్చుకోవడంలో స్థానిక ‘మో పొఖరి’ (నా చెరువు) అనే పథకం కూడా ఓ కారణమని అధ్యయనం తేల్చింది.
బొలంగీర్లో అత్యధికం
అమృత్ సరోవర్ పథకం కింద రాష్ట్రంలో బొలంగీర్ జిల్లా ప్రథమ స్థానం (91 చెరువులు)లో నిలిచినట్లు సీఎస్ ఈ నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా అత్యధిక నీటి వనరులు కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఒడిశాలో 1,81,837 నీటి వనరులు ఉండగా, మనకంటే పశ్చిమ బెంగాల్ (7.47 లక్షలు), యూపీ (2.45 లక్షలు), ఏపీ (1.94 లక్షలు) ముందంజలో ఉన్నాయి. నీటి వనరుల కేటగిరిలో 16,804తో బాలేశ్వర్ ప్రథమ స్థానంలో ఉండగా, మయూర్భంజ్ - 15,986 కేంద్రపడ - 12,509, పూరీ- 9,808, నవరంగపూర్-9760, కేంఝర్- 8912, గంజాం- 8,632 తరువాతి స్థానాల్లో ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం
[ 03-07-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. -
మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
[ 03-07-2024]
రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు
[ 03-07-2024]
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. -
త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు
[ 03-07-2024]
బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
భయపెడుతున్న డెంగీ
[ 03-07-2024]
రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను
[ 03-07-2024]
సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. -
జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స
[ 03-07-2024]
పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
-
వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత: మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్
-
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
-
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
-
అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్
-
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు