20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు.
ప్యాకెట్లలో గోమాంసం. చిత్రంలో కంటెయినర్ చోదకుడు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. ఖుర్దా నుంచి ఓ కంటెయినర్లో గోమాంసం ఆంధ్రవైపు అక్రమంగా రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో గంజాం జిల్లా గంజాం, హుమ్మా, ఛత్రపురంల వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి జాతీయ రహదారిపై కార్యకర్తలు కాపలా కాశారని ఛత్రపురం భజరంగదళ్ నాయకుడు రామకృష్ణ రెడ్డి విలేకరులకు చెప్పారు. మార్గమధ్యంలో కంటెయినర్ను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా, చోదకుడు వేగంగా వాహనాన్ని నడిపారన్నారు. దీంతో అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి, ఆదివారం ఉదయం జగన్నాథపూర్ సమీపాన అడ్డుకున్నామన్నారు. చోదకుడు కార్యకర్తలపై పదునైన ఆయుధంతో దాడికి ప్రయత్నించాడని రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ రవాణాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. గోమాంసం ఖుర్దా నుంచి విశాఖపట్నం (ఆంధ్ర) రవాణా చేస్తున్నట్లు కంటెయినర్ చోదకుడు విలేకరులకు తెలిపాడు. భజరంగదళ్ కార్యకర్తల సమాచారం మేరకు ఛమ్మాఖండి ఠాణా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోమాంసం ప్యాకెట్లు, కంటెయినర్ను స్వాధీనం చేసుకున్నామని, చోదకుడ్ని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఛత్రపురం ఎస్డీపీవో గౌరహరి సాహు విలేకరులకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం
[ 03-07-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. -
మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
[ 03-07-2024]
రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు
[ 03-07-2024]
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. -
త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు
[ 03-07-2024]
బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
భయపెడుతున్న డెంగీ
[ 03-07-2024]
రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను
[ 03-07-2024]
సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. -
జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స
[ 03-07-2024]
పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.