logo

టీమ్‌ ఇండియాకు సైకత యానిమేషన్‌తో శుభాకాంక్షలు

టీ20 ప్రపంచ కప్‌ విజేత టీమ్‌ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్‌ తీర్చిదిద్ది టీమ్‌ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు.

Published : 01 Jul 2024 05:04 IST

న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం: టీ20 ప్రపంచ కప్‌ విజేత టీమ్‌ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్‌ తీర్చిదిద్ది టీమ్‌ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కళాకృతిలో భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ప్రపంచ కప్, భారత్‌ పతాకం తదితరాలు తీర్చిదిద్దాడు. 

పర్లాఖెముండిలో త్రివర్ణ పతాకంతో ఊరేగింపు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించడంతో పట్టణానికి చెందిన యువకులు శనివారం రాత్రి త్రివర్ణ పతాకంతో ఊరేగింపు చేపట్టారు. బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. 17 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించి విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని