ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
ఇద్దరి మృతి, 10 మందికి గాయాలు
ప్రమాదంలో నుజ్జయిన ఆటో
రాయగడ పట్టణం, న్యూస్టుడే: జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. అనంతరం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న బెహరాగుడ గ్రామానికి చెందిన గణేష్ పిడికాక, డెక్కకూడాకు చెందిన సత్య మండంగిలు దుర్మరణం చెందారు. వెనుక కూర్చున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో బ్రహ్మపుర తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం కావడంతో మజ్జిగౌరి మందిరానికి వచ్చే వాహనాలు రహదారికి ఇరువైపులా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. దీంతో సెరిగూడ, పితామహల్ మీదుగా వాహన రాకపోకలకు అనుమతించారు.ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ఘటనా స్థలానికి, ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం
భువనేశ్వర్, న్యూస్టుడే: భువనేశ్వర్ జయదేవ్ విహార్ పరిధిలో శనివారం రాత్రి విధులు ముగించుకుని తన నివాసానికి వెళుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మధుసూదన్ కిసానికి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనా స్థలంలో ఆయన మృతి చెందాడు. అర్ధరాత్రి విషయం తెలిసిన తర్వాత డీసీపీ ప్రతీక్ సింగ్ చేరుకుని పార్థివ దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పోస్ట్మార్టం జరిగింది. మృతుడు మల్కాన్గిరి వాసి కాగా భువనేశ్వర్లో ఉద్యోగ రీత్యా కుటుంబంతో ఉన్నారు. అధికార లాంఛనాలతో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటనకు కారణమైన వాహన చోదకుడు పరారయ్యాడు. సీసీటీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.. విశ్రాంత అధికారిణికి జైలు శిక్ష
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: గంజాం జిల్లా పురుషోత్తంపూర్ సమితి విశ్రాంత మహిళా సామాజిక విద్యాధికారి పి.ఆదిలక్ష్మీ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బ్రహ్మపురలోని ప్రత్యేక విజిలెన్స్ న్యాయస్థానం విచారించింది. ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించలేని పక్షంలో మరో రెండు నెలలు కారాగార శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నట్లు రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టరేట్ రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమె పురుషోత్తంపూర్ సమితి ప్రాంతంలో మహిళా సామాజిక విద్యాధికారిగా పనిచేసిన సమయంలో వివిధ పింఛన్ల సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బ్రహ్మపుర విజిలెన్స్ డివిజన్ అప్పట్లో కేసు నమోదు చేసిందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం
[ 03-07-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. -
మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
[ 03-07-2024]
రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు
[ 03-07-2024]
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. -
త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు
[ 03-07-2024]
బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
భయపెడుతున్న డెంగీ
[ 03-07-2024]
రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను
[ 03-07-2024]
సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. -
జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స
[ 03-07-2024]
పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి