శరత్ రాజీనామా చేయాల్సిందే..!
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి శరత్ పట్నాయక్ రాజీనామా చేయాలని సహచరులు గొంతెత్తారు.
పీసీసీ పదవి నుంచి తప్పుకోవాలని సహచరుల డిమాండ్
ఏఐసీసీ పెద్దల వైపు నేతల చూపు
న్యూస్టుడే, భువనేశ్వర్
కాంగ్రెస్ భవన్
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి శరత్ పట్నాయక్ రాజీనామా చేయాలని సహచరులు గొంతెత్తారు.
సమీక్ష ఊసేలేదు
సార్వత్రిక ఎన్నికల్లో 15 లోక్సభ, 90 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ జోష్యం చెప్పారు. కానీ 14 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు దక్కించుకుంది. నువాపడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శరత్ ఓటమి పాలయ్యారు. పార్టీ పరాజయానికి కారణాలపై ఇంతవరకు సమీక్ష జరగలేదు. సీఎల్పీ నేత ఎవరో తేల్చలేదు. శరత్పై అసంతృప్తితో రగిలిపోతున్న పార్టీ నేతలు ఇటీవల ఇంకు చల్లిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాయకత్వం అయిదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనికి నిరసనగా యువనేతలు కాంగ్రెస్ కార్యాలయం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. మరోవైపు సీనియర్ నాయకులు సైతం ప్రసార సాధనాల ఎదుట శరత్ పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాజీనామా చేయడం ఉత్తమం
కాంగ్రెస్ అగ్రనేత పంచానన్ కానుంగో గురువారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... తన సీటు ఓడిపోయి శరత్ ప్రతిష్ఠ కోల్పోయారన్నారు. పీసీసీ పదవికి ఆయన అనర్హుడని రాజీనామా చేయడం ఉత్తమమని తెలిపారు. పార్టీ ఓటమికి ఆయన ఆయన నైతిక బాధ్యత వహించాలన్నారు.
అప్పట్లో పదవి వదులుకున్నాను
పీసీసీ మాజీ అధ్యక్షుడు జయదేవ్ జెనా మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి పాలైన వెంటనే తాను నైతిక బాధ్యత వహించి పీసీసీ పదవి వదులుకున్న సంగతి ప్రస్తావించారు. పరోక్షంగా శరత్ రాజీనామా చేయాలని సూచన చేశారు.
మునుపటి కంటే మెరుగైంది
పీసీసీ అధ్యక్షుడు శరత్ మాట్లాడుతూ... 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. బిజద ఒక్క ఎంపీ సీటు నిలబెట్టుకోలేకపోయిందని, కొరాపుట్లో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. తమ పార్టీ ఓటమికి కారణాలను అధిష్ఠానానికి తెలియజేస్తామన్నారు. సహచరులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న అంశంపై అడగ్గా శరత్ స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు