సీఎల్పీ అధ్యక్షుడెవరు?
సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడి స్థానం కోసం కొరాపుట్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారాల్లో ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్న నేతలు ఇప్పుడు నువ్వా? నేనా? అన్నరీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
రేసులో తారాప్రసాద్, రామచంద్ర కడమ్
జయపురం, న్యూస్టుడే: సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడి స్థానం కోసం కొరాపుట్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారాల్లో ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్న నేతలు ఇప్పుడు నువ్వా? నేనా? అన్నరీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర సీఎల్పీ అధ్యక్షుడి రేసులో జయపురం, పొట్టంగి ఎమ్మెల్యేలు తారాప్రసాద్ వాహినీపతి, రామచంద్ర కడమ్ ఉన్నారు. తారా ప్రసాద్తో కలివిడిగా ఉన్న ఎంపీ సప్తగిరి ఉలక ఇప్పుడు రామ్చంద్రకు మద్దతిస్తుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఎంపీ ఉలక, కడమ్ సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన విషయం తెలిసిందే. ఉలక కడమ్కు ఆ స్థానం ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన తారాప్రసాద్కు ఆ స్థానం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికిచ్చినా పర్వాలేదు: కడమ్
సీఎల్పీ అధ్యక్షుడి స్థానం మా ఇద్దరిలో ఎవరికి వరించినా పర్వాలేదని రామచంద్ర కడమ్ అన్నారు. వాహినీపతి గిరిజనుల మనిషి. తాను ప్రజల మధ్యకు వెళ్తారు. అందువల్ల ప్రజల్లో ఆయనకు ఆదరణ ఎక్కువ ఉందని కడమ్ అన్నారు. తామంతా గెలిచిన సందర్భంగా ఖర్గేను కలిశామని ఇందులో వేరే ఉద్దేశమేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజల కోసం గళం విప్పుతా: తారా ప్రసాద్
తనకు పార్టీ ఎటువంటి స్థానాలు కట్టబెట్టకపోయినా ప్రజలకోసం అసెంబ్లీలో తన గళం విప్పడం తగ్గదని తారాప్రసాద్ అన్నారు. ప్రతీ సమస్య పరిష్కరించేందుకు అసెంబ్లీలో ప్రత్యర్థి స్థానంలో ఉంటూ ప్రశ్నిస్తూ వచ్చానని, అందువల్ల తనకు ‘అసెంబ్లీ టైగర్’ అన్న బిరుదు వచ్చిందన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ అధ్యక్షుడి స్థానం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.