శ్రీక్షేత్రానికి రూ.500 కోట్లు సరిపోవు
పూరీ శ్రీక్షేత్రానికి ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని, కానీ వ్యయం బాగా పెరిగిందని పూరీ రాజు, శ్రీక్షేత్ర పాలక వర్గం అధ్యక్షుడు గజపతి దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లు కర్పస్ నిధి సరిపోదని పేర్కొన్నారు.
పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్
గోపాలపూర్, న్యూస్టుడే
పూరీ శ్రీక్షేత్రం
పూరీ శ్రీక్షేత్రానికి ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని, కానీ వ్యయం బాగా పెరిగిందని పూరీ రాజు, శ్రీక్షేత్ర పాలక వర్గం అధ్యక్షుడు గజపతి దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లు కర్పస్ నిధి సరిపోదని పేర్కొన్నారు. రథయాత్ర నేపథ్యంలో గజపతి గురువారం రాత్రి ఒక వార్త సంస్థతో మాట్లాడారు. జగన్నాథుని సేవల సామగ్రికి, సేవాయత్ల జీతభత్యాలు, ఇతర వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో పోలిస్తే శ్రీక్షేత్రానికి సమకూరుతున్న ఆదాయం నామ మాత్రంగా ఉందన్నారు. కర్పస్ ఫండ్ సేవల కింద వినియోగించలేమని, ఈ మొత్తం బ్యాంకుల్లో ఉంటుందని, వడ్డీ మాత్రమే ఖర్చవుతోందని, బ్యాంకులు చెల్లిస్తున్న 5 నుంచి 6 శాతం వడ్డీ సరిపోదని చెప్పారు. పురుషోత్తమునికి దేశ వ్యాప్తంగా భూములున్నాయని, కొంతమేరకు కబ్జా జరిగాయని, ఇవి విక్రయించి, సొమ్ము బ్యాంకుల్లో జమచేస్తే, ఆలయానికి వడ్డీ పెద్దమొత్తం అందుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
రద్దీ నియంత్రణ సాధ్యమే
జగన్నాథ దర్శన వ్యవస్థ సులభతరం చేయొచ్చని మొబైల్ ద్వారా స్లాబ్ బుకింగ్ చేసుకున్న వారు నిర్ణీత వేళల్లో ఆలయానికి వస్తారన్నారు. ఈ వ్యవస్థ ప్రారంభిస్తే శ్రీక్షేత్రం వెలుపల భక్తులు బారులుదీరి వేచి చూసే పరిస్థితి ఉండదన్నారు. గర్భగుడిలో రద్దీ తగ్గుతుందన్నారు.
సంపద భద్రంగా ఉంది
గజపతి దివ్యసింగ్ దేవ్
శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద భద్రంగా ఉందన్నారు. 1927లో తమ తాత కపిలేంద్రదేవ్ ఆభరణాలను కొయ్యపెట్టెల్లో ఉంచారని, సంపదంతా పెట్టెల్లో ఉందని, దీనికి ఆధునిక తరహా భద్రత కల్పించాల్సినవసరం ఉందన్నారు. స్వామికి సంబంధించి వజ్రవైఢుర్యాలు, గోమేదిక, పుష్యరాగాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, కిరీటాలున్నాయని వీటి నాణ్యతపై పరిశీలన జరగలేదన్నారు. లెక్కింపు సమయంలో సంపద విలువ గురించి అధ్యయనం చేస్తే బాగుంటుందన్నది తమ అభిప్రాయమన్నారు. సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులకు జస్టిస్ అర్జిత్ పసాయత్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇదివరకు ప్రభుత్వానికి సూచనలు చేసిందన్నారు. తాము త్వరలో ముఖ్యమంత్రి మోహన్చరణ్మాఝి, న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్లను కలిసి తమ అభిప్రాయాలు తెలియజేస్తామని గజపతి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
స్వచ్ఛ సర్వేక్షన్కు సిద్ధం కండి
[ 01-07-2024]
రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్-2024కు అన్ని పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ) సిద్ధం కావాలని సర్కార్ పిలుపునిచ్చింది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి క్షేత్రస్థాయి సర్వేలు మొదలుకానున్న నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.