అలరించిన నృత్యాలు
‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’ (రాతెస) గురువారం వర్చువల్లో నిర్వహించిన 9వ వార్షికోత్సవాల్లో బ్రహ్మపుర కళాకారులు సందడి చేశారు. బ్రహ్మపురానికి చెందిన ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం(ఏబీవీఎస్) రాతెస అనుబంధ సంస్థ. ఏబీవీఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’ (రాతెస) గురువారం వర్చువల్లో నిర్వహించిన 9వ వార్షికోత్సవాల్లో బ్రహ్మపుర కళాకారులు సందడి చేశారు. బ్రహ్మపురానికి చెందిన ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం(ఏబీవీఎస్) రాతెస అనుబంధ సంస్థ. ఏబీవీఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. గిరి మార్కెట్లోని గంటన్నరపాటు సాంస్కృతికోత్సవాలు అలరించాయి. నగరానికి చెందిన ‘అన్నమయ్య సంకీర్తనా రవళి’ బృందం అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. యువ గాయకుడు వనమాలి అవినాష్ భక్తి గీతాలు, బాలికలు వై.సహస్ర, సీహెచ్.దక్షిత, ఆకాంక్షల నృత్యాలు కట్టిపడేశాయి. యువ కళాకారిణి వనమాలి లలితా హాసిని శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్థానిక లలితా కల్చరల్ అకాడమీ చిన్నారులు నాట్యాలతో ముగ్ధులను చేశారు. వి.చంద్రకళ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా, కె.పి.కృష్ణారావు, ఎం.కల్యాణి, ఎస్.జానకి, వై.అక్షయ, జి.వి.రామ్కుమార్ తదితరులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.
అన్నమయ్య సంకీర్తనా రవళి బృందం సభ్యుల కీర్తనాలాపనలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి