రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం..!
రాష్ట్రాభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తామని, డబుల్ ఇంజిన్ పాలనలో రానున్న అయిదేళ్లలో ఒడిశా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెప్పారు.
సీఎంకు ప్రధాని హామీ
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రాభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తామని, డబుల్ ఇంజిన్ పాలనలో రానున్న అయిదేళ్లలో ఒడిశా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెప్పారు. గురువారం రాత్రి దిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో సీఎం, ఉపముఖ్యమంత్రుల కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడలు మర్యాదపూర్వకంగా కలిశారు. తరువాత ప్రధాని మోదీతో సమావేశమైన వారంతా భాజపా మేనిఫెస్టో, ఇతర హామీలు నెరవేర్చడానికి సహకరించాలని కోరారు. 2036లో స్వతంత్ర ఒడిశా వందేళ్ల పండగ జరుపుకోనుండగా, ఈ వ్యవధిలో ప్రగతి పరుగులు తీయాలని కోరారు. శుక్రవారం కేంద్రమంత్రులు నితీన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్లతో సమావేశమయ్యారు. అనంతరం ఒడిశా భవన్లో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ... డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రానికి ఇబ్బందులుండవన్నారు. రథయాత్రలో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని కోరామని, ఆమె అంగీకారం తెలిపారన్నారు. ఈ సందర్భంగా ఒడిశా భవన్లో ప్రముఖులు సీఎంను కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.