రాయగడ డీఎల్వో సస్పెన్షన్
రాయగడ జిల్లా కార్మికశాఖ అధికారి (డీఎల్వో)పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన నేరారోపణ కింద డీఎల్వో జాస్మిన్ సుదర్శిని సాహును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
జాస్మిన్ సుదర్శిని సాహు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాయగడ జిల్లా కార్మికశాఖ అధికారి (డీఎల్వో)పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన నేరారోపణ కింద డీఎల్వో జాస్మిన్ సుదర్శిని సాహును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జాస్మిన్పై సస్పెన్షన్ ఉన్నంత కాలం కార్మికశాఖ కమిషనర్ అనుమతి లేకుండా ఆమె జిల్లా కేంద్రాన్ని విడిచి ఎక్కడకీ వెళ్లరాదని ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఒడిశా సర్వీస్ కోడ్-90 నియమావళి ప్రకారం... జీవనోపాధి భృతికి మాత్రమే ఆమె ప్రస్తుతానికి అర్హురాలని అందులో స్పష్టం చేసింది. మృతి చెందిన అసంఘటిత, నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సర్కార్ చెల్లించే పరిహారం విషయంలో అధికారులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాయగడ జిల్లా కార్మిక శాఖ అధికారులపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది. దీనికితోడు ప్రభుత్వం తరఫున తమకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని మునిగుడ సమితి అంబోదల గ్రామం హరిజన్ వీధికి చెందిన పలువురు బాధిత కార్మిక కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం కలెక్టర్కు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కార్ డీఎల్వోపై చర్యలు తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.