logo

బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతున్నట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయనం కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్‌.మూర్తి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Published : 29 Jun 2024 03:23 IST

రాష్ట్రానికి భారీ వర్షసూచన

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతున్నట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయనం కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్‌.మూర్తి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. అల్పపీడనం ఆదివారం వరకు రాష్ట్రంపై ప్రభావం చూపనుందని భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. కడలి కెరటాల ఉద్ధృతి అధికంగా ఉన్నందున 30 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం కలహండి, కొంధమాల్‌ రాయగడ, నయాగఢ్, గంజాం, జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, భద్రక్‌ జిల్లాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల చొప్పున అతిభారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఖుర్ధా, పూరీ, బాలేశ్వర్, జాజ్‌పూర్, కటక్, బొలంగీర్, నువాపడ, బౌద్ధ్, అనుగుల్, ఢెంకనాల్, గజపతి, కేంఝర్‌ మయూర్‌భంజ్, కొరాపుట్‌ జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వాన కురిసే సూచనలున్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో జయపురంలో 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదుకాగా, ఢెంకనాల్‌లో 11, మల్కాన్‌గిరిలో 9, ఖుర్ధాలో 8, రాయగడ జిల్లా గుణుపురంలో 7, జాజ్‌పూర్‌లో 7, ఖుర్ధాలో 6, కలహండిలో 6, నవరంగపూర్‌ తెంతులిఖుంటిలో 6 సెంటీమీటర్ల చొప్పున వానలు కురిశాయి. ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్లు మూర్తి చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని