బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతున్నట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయనం కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.
రాష్ట్రానికి భారీ వర్షసూచన
గోపాలపూర్, న్యూస్టుడే: ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతున్నట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయనం కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు. అల్పపీడనం ఆదివారం వరకు రాష్ట్రంపై ప్రభావం చూపనుందని భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. కడలి కెరటాల ఉద్ధృతి అధికంగా ఉన్నందున 30 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం కలహండి, కొంధమాల్ రాయగడ, నయాగఢ్, గంజాం, జగత్సింగ్పూర్, కేంద్రపడ, భద్రక్ జిల్లాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల చొప్పున అతిభారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఖుర్ధా, పూరీ, బాలేశ్వర్, జాజ్పూర్, కటక్, బొలంగీర్, నువాపడ, బౌద్ధ్, అనుగుల్, ఢెంకనాల్, గజపతి, కేంఝర్ మయూర్భంజ్, కొరాపుట్ జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వాన కురిసే సూచనలున్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో జయపురంలో 12 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదుకాగా, ఢెంకనాల్లో 11, మల్కాన్గిరిలో 9, ఖుర్ధాలో 8, రాయగడ జిల్లా గుణుపురంలో 7, జాజ్పూర్లో 7, ఖుర్ధాలో 6, కలహండిలో 6, నవరంగపూర్ తెంతులిఖుంటిలో 6 సెంటీమీటర్ల చొప్పున వానలు కురిశాయి. ఇతర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్లు మూర్తి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ ఒడిశా నిర్మాణమే ధ్యేయం
[ 01-07-2024]
‘వికసిత్ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. -
సెప్టెంబరు 17న ‘సుభద్ర’ శుభారంభం
[ 01-07-2024]
మహిళలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ‘సుభద్ర’ పథకాన్ని సెప్టెంబరు 17న ప్రధాని జన్మదినంనాడు నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి చెప్పారు. -
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్
[ 01-07-2024]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మనోజ్ అహుజా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈయన హరియాణాకు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. లోక్సేవాభవన్ (సచివాలయం)కు వచ్చిన మనోజ్ను ఉద్యోగ విరమణ చేసిన ప్రదీప్కుమార్ ఆహ్వానించి కార్యాలయానికి తీసుకొచ్చారు. -
మోదీ మన్కీ బాత్లో రథయాత్ర
[ 01-07-2024]
ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ’మన్కీబాత్’ ఆకాశవాణి రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. -
సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్
[ 01-07-2024]
సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. -
20 టన్నులకుపైగా గోమాంసం స్వాధీనం
[ 01-07-2024]
గంజాం జిల్లా జగన్నాథపూర్ కూడలి సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కంటెయినర్లో అక్రమంగా రవాణా అవుతున్న 20 టన్నులకుపైగా గోమాంసాన్ని ఛత్రపురం భజరంగదళ్ కార్యకర్తలు, స్థానికులు ఆదివారం పట్టుకున్నారు. -
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
-
రోహిత్ తర్వాత ఎవరు..?
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా