అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది.
నవీన్ ఆరోసారి పోటీకి దిగిన స్థానం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది అధికారపీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఆరోసారి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రెండు దశాబ్దాలకుపైగా బిజద ఖాతాలో చేరింది. 1956 నుంచి 1990 వరకూ వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మధ్యలో ఒకసారి జనతాదళ్, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1997లో తండ్రి బిజు పట్నాయక్ మరణానంతరం నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997లో అస్కా లోక్సభ ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత తండ్రి పేరిట బిజు జనతాదళ్ (బిజద) ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి పగ్గాలు చేపట్టి 2000 సంవత్సరంలో తొలిసారిగా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా అయిదుసార్లు ఈ నియోజకవర్గం ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు.
పోటీలో ప్రత్యర్థులు
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల హింజిలి, శెరగడ సమితుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయాచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న నవీన్ హింజిలి, శెరగడ సమితులు దేశఖ్యాతి గాంచాయన్నారు. ప్రజలంతా మరోసారి శంఖాల గుర్తులపై ఓట్లేసి లోక్సభ, అసెంబ్లీ బిజద అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి భాజపా అభ్యర్థిగా శిశిర్ మిశ్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా రజనీకాంత్ పాఢి బరిలోకి దిగారు. వీరితోపాటు ఆప్, ఎస్యూసీఐ (కమ్యూనిస్టు) తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది త్వరలో తేలుతుంది. ఆరోసారి గెలుపొంది నవీన్ రికార్డు సాధిస్తారని బిజద నాయకులు దీమా వ్యక్తం చేస్తుండగా, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆ ప్రభావం హింజిలిలో ఏ మేరకు ఉంటుందన్నది వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమ గెలుపు నిశ్చయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంత్రాక్స్తో ఆరుగురికి అస్వస్థత
[ 29-06-2024]
కోరాపుట్ జిల్లాలో ఈ ఏడాది ఆంత్రాక్స్ జోరుగా వ్యాపిస్తుంది. -
పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత
[ 29-06-2024]
అడవి నుంచి తీసుకొచ్చిన పుట్టగొడుగులను వంట చేసి తిన్న అనంతరం ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. -
ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
[ 29-06-2024]
-
శరత్ రాజీనామా చేయాల్సిందే..!
[ 29-06-2024]
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో కుమ్ములాటలు మళ్లీ మొదలయ్యాయి. నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి శరత్ పట్నాయక్ రాజీనామా చేయాలని సహచరులు గొంతెత్తారు. -
సీఎల్పీ అధ్యక్షుడెవరు?
[ 29-06-2024]
సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడి స్థానం కోసం కొరాపుట్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారాల్లో ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్న నేతలు ఇప్పుడు నువ్వా? నేనా? అన్నరీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. -
శ్రీక్షేత్రానికి రూ.500 కోట్లు సరిపోవు
[ 29-06-2024]
పూరీ శ్రీక్షేత్రానికి ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని, కానీ వ్యయం బాగా పెరిగిందని పూరీ రాజు, శ్రీక్షేత్ర పాలక వర్గం అధ్యక్షుడు గజపతి దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లు కర్పస్ నిధి సరిపోదని పేర్కొన్నారు. -
కాలువలు శుభ్రం చేయాలి.. ఇబ్బంది లేకుండా చూడాలి
[ 29-06-2024]
బీఈఎంసీ పరిధిలోని కాలువల్లో మురుగు నిలిచిపోకుండా చూడాలని, కాలువలు శుభ్రం చేసేందుకు తగు యంత్ర పరికరాలతోపాటు పారిశుద్ధ్య సిబ్బందిని పెంచాలని బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి అన్నారు. -
అలరించిన నృత్యాలు
[ 29-06-2024]
‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’ (రాతెస) గురువారం వర్చువల్లో నిర్వహించిన 9వ వార్షికోత్సవాల్లో బ్రహ్మపుర కళాకారులు సందడి చేశారు. బ్రహ్మపురానికి చెందిన ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం(ఏబీవీఎస్) రాతెస అనుబంధ సంస్థ. ఏబీవీఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం..!
[ 29-06-2024]
రాష్ట్రాభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తామని, డబుల్ ఇంజిన్ పాలనలో రానున్న అయిదేళ్లలో ఒడిశా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెప్పారు. -
రాయగడ డీఎల్వో సస్పెన్షన్
[ 29-06-2024]
రాయగడ జిల్లా కార్మికశాఖ అధికారి (డీఎల్వో)పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన నేరారోపణ కింద డీఎల్వో జాస్మిన్ సుదర్శిని సాహును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఎస్గా మనోజ్ ఆహుజా నియామకం
[ 29-06-2024]
సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ ఆహుజా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికార వర్గాలు ప్రకటించాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
[ 29-06-2024]
ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతున్నట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయనం కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
-
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్