logo

Odisha: కూలీ పనులకు వెళ్లి అనంత లోకాలకు

జిల్లాలో వలస కార్మికురాలు మృతి చెందింది. కూలీ పని కోసం ఏపీలోని హైదరాబాద్‌కు వెళ్ళి కన్ను మూసింది.

Published : 01 Jul 2024 17:26 IST

నవరంగ్‌పూర్‌: జిల్లాలో వలస కార్మికురాలు మృతి చెందింది. కూలీ పని కోసం ఏపీలోని హైదరాబాద్‌కు వెళ్ళి కన్ను మూసింది. మృతురాలు జోరిగావ్ సమితి చితబెడ గ్రామానికి చెందిన పద్మన్ హరిజన్ భార్య మన్మతి(55)గా పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన దంపతులు 25 రోజుల క్రితం కుటుంబాన్ని పోషించుకునేందుకు హైదరాబాద్‌లో ఇటుక బట్టీల కూలీ పని చేసిందుకు వెళ్ళారు. శనివారం రాత్రి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆ రాత్రి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లాకు తీసుకొచ్చారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో మృతి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు