logo

Crime news: యువకుడి దారుణ హత్య

గంజాం జిల్లా గొలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాది కూడలి వద్ద ఆదివారం సాయంత్రం ఎ. బాలు (24) అనే యువకుడిని హత్య చేశారు.

Published : 01 Jul 2024 17:20 IST

బ్రహ్మపురం నగరం: గంజాం జిల్లా గొలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాది కూడలి వద్ద ఆదివారం సాయంత్రం ఎ. బాలు (24) అనే యువకుడిని హత్య చేశారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా కేదారపురానికి చెందినవాడని గొలంత్రా ఠాణా ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ బిబేకానంద స్వయిన్ సోమవారం న్యూస్ టుడేకు చెప్పారు. బెలపడకు చెందిన 5 యువకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహానికి సోమవారం ఎంకేసీజీలో పరీక్ష జరిపించామని అన్నారు. ఈ దాడిలో అడ్డుకునేందుకు వెళ్లిన అతడి ఇద్దరు మిత్రులపైనా నిందితులు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని