logo

Odisha: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

నవరంగపూర్‌ జిల్లా, జొరిగావ్ సమితి బిజాపూర్‌ పంచాయతీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

Published : 03 Jul 2024 17:25 IST

నవరంగపూర్‌: నవరంగపూర్‌ జిల్లా, జొరిగావ్ సమితి బిజాపూర్‌ పంచాయతీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు దారువాగుడ గ్రామానికి చెందిన ద్రౌపది బోత్ర (59)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్రౌపది తన కుమార్తె ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా, స్థానిక బస్టాండ్ వద్ద ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు ఉమ్మర్‌కోట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ద్రౌపదిమృతి చెందింది. శవపరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని