logo

అద్దంకి నుంచి తిరుమలకు తెదేపా కార్యకర్తల పాదయాత్ర

అద్దంకి నుంచి తిరుమలకు పాదయాత్రగా  బయలుదేరిన తెదేపా కార్యకర్తలకు భాజపా కావలి పట్టణాధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం సంఘీభావం తెలిపారు.

Published : 03 Jul 2024 12:44 IST

కావలి: అద్దంకి నుంచి తిరుమలకు పాదయాత్రగా  బయలుదేరిన తెదేపా కార్యకర్తలకు భాజపా కావలి పట్టణాధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం సంఘీభావం తెలిపారు. అద్దంకి నియోజకవర్గం నుంచి తిరుమలకు బయలుదేరిన రేణింగవరం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలు కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జపా కావలి పట్టణాధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం వారికి స్వాగతం పలికారు. కేంద్రం,  రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం, అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్‌ గెలవడంతో పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న వారి సంకల్పం గొప్పదని, ఆ పాదయాత్ర విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు