గురుకులంపై ఆశ.. సీట్లు లేక నిరాశ
జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు
అధికారులకు 600 వినతులు
సీట్ల కోసం జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు
న్యూస్టుడే, నెల్లూరు(విద్య): జిల్లాలోని గురుకులాల్లో చదువుకోవాలనే ఆసక్తితో పేద విద్యార్థులు వందల సంఖ్యలో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రతిరోజూ పెద్దసంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెల్లూరు నగరంలోని గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయానికి వచ్చి వినతులు సమర్పిస్తున్నారు. కలెక్టరేట్లోనూ వినతులు ఇస్తున్నారు.
ఏళ్లుగా పెరగక..
జిల్లా వ్యాప్తంగా 8 గురుకులాలు ఉన్నాయి. ఆరింటిలో అయిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, రెండింటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన, వసతి కల్పిస్తున్నారు. జిల్లా విభజనలో భాగంగా బాలురకు ఉన్న గురుకులాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం బాలికల విద్యకే విద్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న విద్యాలయాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతికి 80 చొప్పున మొత్తం మీద 4,800 సీట్లు ఉన్నాయి. వీటికి ఏటా సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తుంటారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. గురుకులాలలో సీట్లు పొందేందుకు పేద మధ్యతరగతి విద్యార్థులు వేలల్లో పోటీ పడుతుంటారు. పోటీ పరీక్ష తెలియక రాయలేని విద్యార్థులు అధిక సంఖ్యలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు గురుకుల విద్యాలయాల్లో వివిధ తరగతుల్లో చదివేందుకు అవకాశం కల్పించాలంటూ బుధవారం వరకు 550కి పైగా వినతులు వచ్చాయి. కలెక్టరేట్లో 50కి పైగా వినతులు అందాయి.
పట్టించుకోని నాటి ప్రభుత్వం
ఎన్నో ఏళ్ల నాడు ప్రారంభించిన గురుకుల పాఠశాలలో ఆరింటిని ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేశారు. ప్రతి తరగతికి 80 మంది విద్యార్థుల చొప్పున బోధన అందిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో సీట్లను పెంచిన దాఖలాలు లేవు. గతంలో తెదేపా ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో సీట్లు పెంచుతూ ప్రతిపాద]నలు చేపట్టింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెదేపా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశలో భాగంగా ఇటీవల మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ తెదేపా హయాంలో గురుకులాల్లో మంజూరైన 1500 సీట్లను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని వీటిని తిరిగి పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అద]నపు సీట్ల భర్తీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో కూడా సీట్లు పెరగొచ్చని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, గురుకుల కోఆర్డినేటర్ చొరవ చూపి అద]నపు సీట్లు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు తెలియజేస్తాం
గురుకులాల్లో చదివేందుకు ఏటా పోటీ పెరుగుతోంది. ఉన్న సీట్లు పూర్తయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అర్జీలు వస్తున్నాయి. విషయం ఉన్నతాధికారులకు తెలిపాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అద]నపు సీట్లను కేటాయిస్తే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది.
- హేమలత, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక
[ 07-07-2024]
కావలి ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షులుగా తటవర్తి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. -
జలవనరులకు జవసత్వాలు!
[ 07-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో జలవనరులు నిర్వీర్యమయ్యాయి. జలాశయాల్లో నీరున్నా.. కాలువలకు మరమ్మతులు విస్మరించడం.. పూడికనూ తొలగించకపోవడంతో ఆయకట్టుకు నీరందడం గగనమైంది. -
దుర్గం కొండపై గుప్త నిధుల ముఠా సంచారం
[ 07-07-2024]
ఉదయగిరి దుర్గం కొండపై గుప్త నిధుల తవ్వకాల ముఠాల సంచారం యథేచ్ఛగా సాగుతోంది. రాజులు, నవాబుల పాలనలో ఇక్కడ అనేక కట్టడాలు వెలిశాయి. -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి
[ 07-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నారాయణ మెడికల్ కళాశాలలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమయ్యారు. -
సమగ్ర అధ్యయనం తర్వాత నిర్ణయం
[ 07-07-2024]
సమగ్ర అధ్యయనం తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర క్రీడలు, రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. -
హతవిధీ.. ఆయుష్ తీశారు మరి
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయ వైద్యం ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యం నీరుగారుతోంది. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, ప్రకృతి వైద్యం, యోగా.. -
అక్రమాలు కోకొల్లలు.. తొక్కిపెట్టిన నాయకులు
[ 07-07-2024]
తిప్పలను మింగిన తోడేళ్లకు వైకాపా ప్రభుత్వం ఎంత రక్షణ కల్పించిందో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాడు సంగం మండలంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగింది. -
కొలిక్కిరాని భూసేకరణ
[ 07-07-2024]
రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో సర్వం కోల్పోతున్న కర్లపాలెం వాసులకు పునరావాసం ఎంపిక క్లిష్టంగా మారింది. మూడేళ్లుగా అధికారులు భూసేకరణ కొలిక్కి తీసుకురాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
ఎస్సీ కార్పొరేషన్లో ఏం జరుగుతోంది?
[ 07-07-2024]
ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్న పీటీ సెల్విని సస్పెండ్ చేస్తూ ఏపీఎస్సీసీఎఫ్సీ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ చిన్నరాముడు ఆదేశాలు జారీచేశారు. -
వృత్తి ఎలక్ట్రీషియన్.. ప్రవృత్తి కరెన్సీ సేకరణ
[ 07-07-2024]
పాత కాలంలో ఏ కరెన్సీ వాడేవారు, నవాబులు, బ్రిటిషు పాలనలో ఎలాంటి డబ్బు చెలామణిలో ఉండేది, ఇతర దేశాలకు చెందిన నాణేలు ఎలా ఉంటాయి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
-
మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు