ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా దొంగతనాలు
ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తుతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాలులో గురువారం అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య నిందితుల వివరాలను వెల్లడించారు. దుత్తలూరు మండలం రాచవారిపల్లికి చెందిన పాత నేరస్థుడు పి.వెంకటరత్నం, ప్రకాశం జిల్లా దండుపాలెంకు చెందిన షేక్ మునీర్బాషా స్నేహితులు. వీరు చెడు వ్యసనాలకు బానిసైన పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. కార్లలో తిరుగుతూ రాత్రివేళల్లో పాఠశాలల తాళాలు పగులగొట్టి అందులో ఉన్న ఫ్యాన్లు, టీవీలు, ఏసీలు, ల్యాప్టాప్, సీపీయూ, ప్రింటర్లు దొంగిలించి విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సా చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో సీసీఎస్, ఆత్మకూరు డీఎస్పీలు పి.రామకృష్ణాచారి, ఎన్.కోటారెడ్డి సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఏఎస్పేట వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విచారించగా ఏఎస్ పేట పరిధిలోని పాఠశాలలు, దగదర్తి, విడవలూరు, సంగం, ఉదయగిరి, వరికుంటపాడులో 8 పాఠశాలల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు.
ఒకరిపై సస్పెక్టెడ్ షీటు..: నిందితుల్లో ఒకరైన వెంకటరత్నం పాత నేరస్థుడు. వ్యసనాలకు బానిసై చోరీల బాట పట్టాడు. వంద బైక్ల దొంగతనం కేసుల్లో కీలక నిందితుడు. ఉదయగిరి, మర్రిపాడుతో పాటు వైయస్ఆర్ జిల్లా బద్వేల్లో ఎర్రచందనం కేసుల్లో నిందితుడు. నిందితుడిపై కోవూరు పోలీసు స్టేషన్లో సస్పెక్టెడ్ షీటు ఉంది. ఇటీవల ఆయనకు మునీర్ బాషాతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారని అదనపు ఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ సంగం ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, సాంబశివరావు, రవినాయక్, ఏఎస్పేట ప్రసాద్ రెడ్డి, సీసీఎస్ సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైఫల్యం చదువులకు అసౌకర్యం
[ 08-07-2024]
నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పిస్తున్నామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయింది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో గదుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి పలు బడుల్లో నెలకొంది. -
సర్వం సమస్యలే
[ 08-07-2024]
అధ్వాన పారిశుద్ధ్యం.. పనిచేయని ఏసీలు, సీసీ కెమెరాలు.. మరమ్మతులు చేయని లిఫ్టులు.. అందని నాణ్యమైన వైద్యం.. చెదలు నివారణకు ప్రతినెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. కలగని ప్రయోజనం.. ఇదీ జిల్లా సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి. -
ఉచితం.. నిర్మాణ రంగానికి ఊతం
[ 08-07-2024]
తెదేపా ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఉచిత ఇసుక విధానానికి పచ్చజెండా ఊపింది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో గత అయిదేళ్ల వైకాపా ఇసుకాసురులు చేసిన అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. ఇసుక అందరికీ అందుబాటులో ఉండనుంది. -
పురపాలికలో అక్రమాలపై ఆరా!
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో కావలి పురపాలక సంఘంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు తెదేపా నాయకులు ఆరా తీస్తున్నారు. -
వైకాపా నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వం కీలకమార్గాలపై నిర్లక్ష్యం చూపింది. అయిదేళ్లలో గుంతల్లో చారెడు మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో అడుగుపెట్టేందుకు వీల్లేకుండా తయారయ్యాయి. పలు గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. -
చిరుతిండి.. రోగాలు దండి
[ 08-07-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఒక సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు కలుషితమైన అహారం తీసుకోవడంతో అతిసారం బారిన పడ్డారు. సిబ్బంది అప్రమత్తమై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యసేవలందించారు. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 08-07-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. -
డీఎస్సీ అభ్యర్థుల సేవలో బీసీ స్టడీ సర్కిల్
[ 08-07-2024]
డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న యువతకు శుభవార్త. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. టెట్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. -
బంగినపల్లి అధరహో
[ 08-07-2024]
బంగినపల్లి మామిడి కాయల సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడక్కడ మిగిలిన కాయలను కొందరు వ్యాపారులు.. రైతుల వద్ద నుంచి దాదాపు కేజీ రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం వెళుతూ దుర్మరణం
[ 08-07-2024]
ఉద్యోగం కోసం వెళుతున్న వ్యక్తిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముందు వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన కొమ్మలపూడి అడ్డరోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. -
సర్వేపల్లి జలాశయం పనుల్లో అక్రమాలు
[ 08-07-2024]
వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరందించే సర్వేపల్లి జలాశయం ఆధునికీకరణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు సురేశ్ నాయుడు ఆరోపించారు.